ఐపీఎల్ ఆల్ టైమ్ ప్లేయింగ్ 11 ఇదే.. రోహిత్, భువీలకు అంత సీన్ లేదన్న కోహ్లీ కెప్టెన్..!

Rajat Patidar All Time IPL Playing XI: రజత్ పాటిదార్ తన ఆల్-టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ 11ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ జట్టులో రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్‌లకు చోటు దక్కలేదు. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాలకు స్థానం కల్పించగా, మరికొంతమంది దిగ్గజాల పేర్లను పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. పాటిదార్ ఎంపికలు ఐపీఎల్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఐపీఎల్ ఆల్ టైమ్ ప్లేయింగ్ 11 ఇదే.. రోహిత్, భువీలకు అంత సీన్ లేదన్న కోహ్లీ కెప్టెన్..!
Rajat Patidar All Time Ipl Playing Xi

Updated on: Aug 25, 2026 | 4:48 PM

Rajat Patidar All Time IPL Playing XI: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ తన ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ 11ను ఎంచుకుని షాకిచ్చాడు. ఎందుకంటే ఇందులో రోహిత్ శర్మకు చోటు ఇవ్వలేదు. 2025, 2026లో వరుసగా ఐపీఎల్ టైటిళ్లను గెలిపించిన రజత్ పాటిదార్ ఆర్సీబీ తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఐపీఎల్, ఎంపీటీ20 2026లో ఆకట్టుకున్న పాటిదార్, దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈమేరకు యూట్యూబ్‌లోని స్పోర్ట్స్‌లాంచ్‌ప్యాడ్‌తో మాట్లాడిన ఆయన.. తన ఆల్-టైమ్ ఐపీఎల్ XIని ఎంపిక చేశాడు. ఇందులో ఆర్‌సీబీకి చెందిన నలుగురు దిగ్గజ ఆటగాళ్లు – విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. సీఎస్‌కే దిగ్గజం ఎంఎస్ ధోనీకి కూడా అతని జట్టులో చోటు దక్కగా, రోహిత్ శర్మకు మాత్రం మొండిచేయి చూపించాడు.

ఓపెనర్లుగా ఎవరంటే..?

కాగా, తన ఆల్-టైమ్ ఐపీఎల్ తుది జట్టులో విరాట్ కోహ్లీతో పాటు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్‌ను ఓపెనర్‌గా ఎంచుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ తరపున గేల్ కీలక పాత్ర పోషించి, 152.73 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 3163 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.

మరోవైపు, ఆర్‌సీబీ తరపున ఆడుతూ విరాట్ కోహ్లీ 9336 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించి, అత్యంత విజయవంతమైన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే, మిడిల్ ఓవర్లలో జట్టును బలోపేతం చేయడానికి ఆర్‌సీబీ దిగ్గజం ఏబీ డి విలియర్స్‌కు కూడా చోటు కల్పించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌కు పేరుగాంచిన డి విలియర్స్, 5162 పరుగులతో తన ఐపీఎల్ కెరీర్‌ను ముగించాడు.

ఇవి కూడా చదవండి

రజత్ పాటిదార్ తన ఆల్-టైమ్ ఐపీఎల్ జట్టులో ఆర్‌సీబీ నుంచి ఎంచుకున్న మరో దిగ్గజం యుజ్వేంద్ర చాహల్. చాహల్ పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ, ఆర్‌సీబీ జెర్సీలో అత్యంత సక్సెస్ అయ్యాడు. రెడ్ బ్రిగేడ్ తరపున తన 233 వికెట్లలో 139 వికెట్లను పడగొట్టాడు. మొత్తంగా, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన చాహల్, పాటిదార్ తుది జట్టులో సముచితంగా స్థానం సంపాదించుకున్నాడు.

ఎక్కువమంది చదివినది: Video: 0,W,4,0,W,0.. ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూస్తే ఫిదానే..!

ఇక మిడిల్ ఆర్డర్ ను పటిష్టం చేసేందుకు ఎంఎస్ ధోనీతో పాటు సూర్యకుమార్, సురేష్ రైనా, హార్దిక్ పాండ్యాలను ఎంచుకున్నాడు. 148.58 స్ట్రైక్ రేట్‌తో 4581 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్‌తోపాటు చెన్నై తరపున అద్భుతమైన ఆటతో అలరించిన మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాకు నాల్గవ స్థానాన్ని కేటాయించాడు.

రజత్ పాటిదార్ తన జట్టులో 7వ నంబర్ బ్యాటర్‌గా ఐదుసార్లు ఐపీఎల్ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఎంచుకోగా, ఫాస్ట్ బౌలింగ్ ఆల్-రౌండర్ పాత్రకు ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సరైన ఎంపిక అని అభిప్రాయపడ్డాడు.

రోహిత్ శర్మ, వార్నర్, భువనేశ్వర్, బ్రావోలకు హ్యాండిచ్చిన పాటిదార్..

రజత్ పాటిదార్ తన ఓపెనర్లుగా క్రిస్ గేల్, విరాట్ కోహ్లీలను ఎంచుకోవడంతో, దిగ్గజ జోడీ డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మలకు ఎంపికయ్యే అవకాశం దక్కలేదని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నందున రోహిత్ శర్మ కంటే అతని ఎంపిక సమంజసంగా అనిపించినప్పటికీ, ఐపీఎల్ చరిత్రలో విదేశీ బ్యాటర్లలో అత్యధిక పరుగులు (6565) చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టోర్నమెంట్‌లో 40.52 సగటు, 139.77 స్ట్రైక్ రేట్‌తో, వార్నర్ అత్యంత విజయవంతమైన బ్యాటర్ల జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

ఎక్కువమంది చదివినది: SL vs IND: కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబు‌లో భారీ జంప్..?

మరో ఆసక్తికరమైన ఎంపికలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు బౌలింగ్ విభాగానికి సారథ్యం వహించడానికి డేల్ స్టెయిన్‌ను ఎంచుకున్నాడు. తన కెప్టెన్సీలో ఆర్‌సీబీకి మ్యాచ్ విన్నర్‌గా నిలిచి, ఐపీఎల్ హిస్టరీలో ఫాస్ట్ బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్‌ను పక్కన పెట్టడం గమనార్హం.

ఐపీఎల్‌లో స్టెయిన్, భువనేశ్వర్‌ల గణాంకాలను పోల్చి చూస్తే, ఈ దక్షిణాఫ్రికా స్టార్ 95 మ్యాచ్‌లలో 97 వికెట్లు తీయగా, భువనేశ్వర్ మాత్రం 226 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే.

ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తన ఆల్-టైమ్ ఐపీఎల్ తుది జట్టులో సునీల్ నరైన్‌ను ఎంచుకోవడంతో, డ్వేన్ బ్రావో, లసిత్ మలింగ వంటి దిగ్గజ ద్వయం కూడా చోటు దక్కించుకోలేకపోయారు.

రజత్ పాటిదార్ ఆల్-టైమ్ ఐపీఎల్ XI..

క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోనీ, డేల్ స్టెయిన్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, సునీల్ నరైన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us