AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Cricket: ‘ఓరేయ్ ఆజామూ.. మిమ్మల్ని చూసి ప్రపంచం నవ్వుతోంది రా’

Babar Azam: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ వైఫల్యంపై సెలెక్టర్ ఆఖిబ్ జావేద్ స్పందించాడు. బాబర్ అజామ్, సర్ఫరాజ్ అహ్మద్ కీలక నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించాడు. తొలి రెండు టెస్టుల తర్వాత ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసిన నిర్ణయాన్ని కూడా వివరించాడు.

Pakistan Cricket: ‘ఓరేయ్ ఆజామూ.. మిమ్మల్ని చూసి ప్రపంచం నవ్వుతోంది రా’
Babar Azam
Venkata Chari
|

Updated on: Sep 02, 2026 | 1:51 PM

Share

Babar Azam: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనపై సెలెక్షన్ కమిటీ చీఫ్ ఆఖిబ్ జావేద్ తీవ్రంగా స్పందించాడు. కెప్టెన్ బాబర్ అజామ్, హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ అవసరమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే జట్టు కూర్పులో మార్పులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. పాకిస్థాన్ తొలి రెండు టెస్టుల్లో ఓడిపోయి సిరీస్‌ను 0-2తో కోల్పోయిన తర్వాత ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసింది. మూడో టెస్టుకు కొత్త ఆటగాళ్లను చేర్చడంతోపాటు కోచింగ్ బృందంలోనూ మార్పులు చేసింది. కెప్టెన్, కోచ్ కఠిన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు బోర్డు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆఖిబ్ తెలిపాడు. ముఖ్యంగా పేస్ బౌలింగ్‌లో ఉబైద్ షాకు అవకాశం ఇవ్వాలని తాను సూచించినా ఆ నిర్ణయం అమలు కాలేదని చెప్పాడు. దీంతో కీలక పర్యటనలో జట్టు పోటీ ఇవ్వలేకపోవడం పరిస్థితిని తీవ్రంగా మార్చిందని వివరించాడు.

ఉబైద్ షాకు అవకాశం ఇవ్వాలని సూచన..

ఆఖిబ్ ప్రకారం.. పాకిస్థాన్ జట్టులో ఉబైద్ షా, అదనపు వికెట్ కీపర్, పేస్ ఆల్‌రౌండర్ వంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. సుమారు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల ఉబైద్‌ను ఆడించాలని బాబర్, సర్ఫరాజ్‌కు సూచించినట్లు వెల్లడించాడు. ప్రస్తుత పేసర్లలో ఒకే తరహా వేగం ఉండటంతో బౌలింగ్ విభాగంలో వైవిధ్యం అవసరమని చెప్పాడు.

Viral Video: ఏం క్యాచ్ గురూ.. సూపర్‌మ్యాన్‌ కూడా చేతులెత్తేయాల్సిందే.. బౌండరీ లైన్‌‌లో ఒంటి చేత్తో..!

ఇవి కూడా చదవండి

ఏడుగురిపై వేటు..

లార్డ్స్ టెస్టు ముగిసిన తర్వాత పాకిస్థాన్ ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసింది. మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, మహమ్మద్ అవైస్ జఫర్, ఖుర్రమ్ షహ్‌జాద్ ఈ జాబితాలో ఉన్నారు. వారి స్థానాల్లో సైమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్, అరాఫత్ మిన్హాస్ తదితరులను చేర్చారు.

Team India: 24 గంటల్లోనే మరో గాయం.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?

ఇదే సమయంలో హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌ను కూడా తప్పించారు. వైట్‌బాల్ కోచ్ మైక్ హెసన్, యాష్లే నోఫ్‌కే మూడో టెస్టుకు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంగ్లాండ్ ఇప్పటికే తొలి రెండు టెస్టులు గెలిచి 2-0 ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టు సెప్టెంబర్ 9 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us