
ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. రాయల్స్ కెప్టెన్ రహానే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా ముంబై ఇప్పటికే నాలుగు విజయాలతో పాయింట్స్ పట్టికలో మూడో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు రాయల్స్ ఆడిన ఆరు మ్యాచులలో ఒకటి గెలిచి, ఐదు మ్యాచులు ఓడిపోయింది.