MS Dhoni : మరోసారి అభిమానుల మనసు దోచుకున్న ధోనీ.. సంచలన ప్రకటనతో ఫ్యాన్స్ ఫిదా..

MS Dhoni Announcement: ఒకటే ఉత్కంఠ.. ఒకటే టెన్షన్.. ఏం ప్రకట వినాల్సి ఉంటుందో అని అభిమానులు 18 గంటల పాటు ఊగిపోయారు. అయితే అభిమానులను ఎప్పుడు నొప్పించని కూల్ కెప్టన్.. ఈ సారి కూడా తీయని కబురు చెప్పాడు.. అందరి మనసులు దోచుకున్నాడు.

MS Dhoni : మరోసారి అభిమానుల మనసు దోచుకున్న ధోనీ.. సంచలన ప్రకటనతో ఫ్యాన్స్ ఫిదా..
Ms Dhoni
Follow us

|

Updated on: Sep 25, 2022 | 2:57 PM

తన కెప్టెన్సీలో భారత్‌ను రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) ఆదివారం ఒక ప్రకటన చేశాడు. ధోని ప్రతి ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించగలడని చాలా మంది అభిమానులు భావించినప్పటికీ.. అలాంటిదేమీ జరగకపోవడంతో ధోని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.  కెప్టెన్ కూల్.. బిగ్ అనౌన్స్ మెంట్.. సడెన్ సర్ ప్రైజ్ ఇస్తారని అంతా అనుకున్నారు. ఇంతకీ ఏమై ఉంటుందా కీలక ప్రకటన?  ఇపుడిదే.. ధోనీ ఫ్యాన్స్ లో ఫుల్ డిస్కషన్. ఆ ఆప్షన్లేంటని చూస్తే.. ఐపీఎల్ కు ధోనీ గుడ్ బై చెబుతున్నారా? లేక మరేదైనా కీలక ప్రకటన చేస్తున్నారా? సోషల్ మీడియాకు దూరంగా ఉండే ధోనీ.. ఈ సడెన్ సర్ ప్రైజ్ ఏంటి? ఫ్యాన్స్ ఊపిరి బిగబట్టి చూశారు.

ధోనీ బిస్కెట్లు లాంచ్ చేశాడు 

41 ఏళ్ల ధోనీ ఓరియో బిస్కెట్‌ను విడుదల చేశాడు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో సమాచారం అందించారు.

ఒకరోజు ముందే ప్రకటించారు

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఈ శనివారం తన సోషల్ మీడియా పేజీలో సెప్టెంబర్ 25న ప్రత్యక్ష ప్రసారంలో వస్తానని చెప్పాడు. దీని తర్వాత, అన్ని రకాల క్రికెట్‌ల నుండి 41 ఏళ్ల వెటరన్ రిటైర్మెంట్ గురించి అభిమానులు ఊహించారు. ధోనీ ఆగస్ట్ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, దీని తర్వాత కూడా అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడటం కొనసాగించాడు.

లెజెండరీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని కెరీర్ ..

రెండేళ్ల క్రితం ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ.. ప్రస్తుతం కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు. సీఎస్కే సారధిగా ఎన్నో విజయాలను అందించిన ధోనీ.. గత సీజన్ లో కెప్టెన్సీ జడేజాకు అప్పగించారు. కెప్టెన్సీ వదిలి కేవలం.. బ్యాట్ తో మాత్రమే రాణించి.. తనలో బ్యాట్ జుళీపించే సత్తా ఇంకా ఉందని నిరూపించారు.

చెన్నై సూపర్ కింగ్స్ వరుస వైఫల్యాలు ఎదుర్కోవడంతో.. తిరిగి మహీనే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టారు. అయితే ధోనీ.. సోషల్ మీడియాలో నిన్న పెట్టిన పోస్ట్ తో అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఫేస్ బుక్ లైవ్ ఇస్తానని ప్రకటించడంతో ఇది హాట్ టాపిగ్గా మారింది.. దానికి తోడు ఈ సందర్భంగా తానొక కీలక ప్రకటన చేయనున్నాడని కామెంట్ చేయడంతో.. ఈ లైవ్ పై రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి.

2022 జూలై 7న 41 ఏళ్లు నిండిన ధోని తన అంతర్జాతీయ కెరీర్‌లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ఆరు సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని పేరిట డబుల్ సెంచరీ కూడా ఉంది. వన్డేల్లో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు చేశాడు. భారత్ తరఫున టీ20లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ధోనీ టెస్టుల్లో 4876 పరుగులు, వన్డేల్లో 10773, టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో 1617 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్‌లో మొత్తం 361 మ్యాచ్‌లు ఆడిన ధోని 28 హాఫ్ సెంచరీల సాయంతో మొత్తం 7167 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం