AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: బాబు ఇకనైనా మేలుకో.. లేదంటే జట్టులో ఉండవ్.. పంజాబ్ ఆల్‌రౌండర్ కు నయా వాల్ మాస్ వార్నింగ్

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ నిరాశజనకంగా ఆడుతున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో చాలా తక్కువ పరుగులు చేసి, స్థిరత లేకపోవడంతో పుజారా ఘాటుగా స్పందించాడు. "ఇప్పటికైనా మేలుకో" అంటూ పుజారా హెచ్చరించగా, మరో ఆటగాడైతే జట్టులో ఉండే అవకాశం లేదని పేర్కొన్నారు. అభిమానులు, నిపుణులు మాక్స్వెల్ ఫామ్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, అతను తటస్థంగా కాకుండా బాధ్యతతో ఆడాలని సూచనలు వస్తున్నాయి.

IPL 2025: బాబు ఇకనైనా మేలుకో.. లేదంటే జట్టులో ఉండవ్.. పంజాబ్ ఆల్‌రౌండర్ కు నయా వాల్ మాస్ వార్నింగ్
Glenn Maxwell Cheteshwar Pujara
Narsimha
|

Updated on: Apr 19, 2025 | 12:23 PM

Share

పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్‌కు ఈ ఐపీఎల్ 2025 సీజన్ ఇప్పటివరకు పూర్తి నిరాశను మిగిల్చింది. మెగా వేలంలో రూ. 4.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయబడ్డ మాక్స్వెల్, తన ప్రదర్శనలతో అస్సలు న్యాయం చేయలేకపోతున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 8.20 సగటుతో 41 పరుగులు మాత్రమే చేసి, బంతితో కొంచెం మెరుగ్గా 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. బ్యాట్‌తో చూపిన దారుణమైన ప్రదర్శనపై భారత జట్టు మాజీ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, మాక్స్వెల్‌కి ఘాటు హెచ్చరిక జారీ చేశాడు. మాక్స్వెల్ మేల్కొనాల్సిన అవసరం ఉందని, ఇదే స్థాయిలో ప్రదర్శన ఇచ్చిన మరే ఆటగాడైనా ఇప్పటికీ జట్టు నుండి బయటపడిపోయేవాడని పుజారా పేర్కొన్నారు.

మాక్స్వెల్ తన ఆటను ఎలా ఆడుతున్నాడో, ఐపీఎల్‌ను ఎలా అర్థం చేసుకుంటున్నాడో ఎప్పటికప్పుడు మారడం లేదని, ఎనిమిది-పది సంవత్సరాల క్రితం ఎలా ఆడాడో ఇప్పుడు కూడా అలానే వ్యవహరిస్తున్నాడని పుజారా వ్యాఖ్యానించారు. “ఒక ఆటగాడిగా మేల్కొనాల్సిన సమయం వచ్చిందని నాకనిపిస్తుంది,” అంటూ ESPN Cricinfo T20 టైమ్ అవుట్ షోలో వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌లో మాక్స్వెల్ కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ, అతని స్థిరత్వం ఎప్పటికీ ప్రశ్నార్థకంగా మారిన అంశంగా నిలుస్తోంది. అభిమానులు, క్రికెట్ నిపుణులు అతని ఫామ్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పుజారా మాటల్లో, “మీరు ఫ్రాంచైజీలో భాగమవడమనేది ఒక గొప్ప అవకాశం. జట్టు కోసం మీరు బాధ్యతగా ఉండాలి. మీరు ప్రదర్శన ఇవ్వకపోతే, విమర్శలు సహజం. మాక్స్వెల్ మళ్లీ నిలదొక్కుకోవాలి. ప్రస్తుతానికి అతను మాక్స్వెల్ కాబట్టి జట్టులో కొనసాగుతున్నాడు. ఇదే ఇంకొక ఆటగాడు అయితే అతనికి ఇదే అవకాశం లభించేది కాదు,” అని స్పష్టం చేశారు. మాక్స్వెల్ తన ఆటతీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని, క్యాజువల్‌గా కాకుండా పూర్తి బాధ్యతతో ఆడాల్సిన సమయం ఇదే అని పుజారా సూచించాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, వర్షం కారణంగా ఆలస్యం అయిన ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు పరిమితం చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబి తరపున టిమ్ డేవిడ్ 26 బంతుల్లో 50 పరుగులతో అర్ధ సెంచరీ చేయగా, మొత్తం జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయిన 95 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, మార్కో జాన్సెన్ కీలక వికెట్లు తీసి ఆర్‌సీబిని కష్టాల్లోకి నెట్టారు. లక్ష్యచేధనలో పంజాబ్ కింగ్స్ జట్టు 12.1 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది. నెహాల్ వాధేరా 19 బంతుల్లో 33 పరుగులతో చమకగా ఆడాడు. ఆర్‌సీబి తరపున జోష్ హాజిల్‌వుడ్ 3 వికెట్లు తీసి ప్రభావశీలంగా బౌలింగ్ చేసినా, మిగిలిన బౌలర్లు సరైన మద్దతు ఇవ్వగా జట్టు ఓటమిని చవిచూసింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..