
Rishabh Pant medical bulletin: రిషబ్ పంత్ (Rishabh Pant) గాయాల సమస్యలతో గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఇప్పుడు పూర్తిగా ఫిట్గా మారి ఐపీఎల్ 2026పై దృష్టి సారించాడు. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) కెప్టెన్ అయిన పంత్, మార్చి చివర్లో ప్రారంభమయ్యే టోర్నమెంట్కు అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్ టీ20 జట్టులో ప్రస్తుతం పంత్ స్థానం కాస్త వెనుకబడింది. సంజూ శాంసన్ (Sanju Samson), ఇషాన్ కిషన్ (Ishan Kishan), జితేష్ శర్మ (Jitesh Sharma), ధృవ్ జురేట్ (Dhruv Jurel) ప్రస్తుతం అతని కంటే ముందు ఉన్నారు. పంత్ చివరిసారిగా జులై 2024లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
గత నెల న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్కు ముందు ప్రాక్టీస్ సెషన్లో పంత్ రైట్ ఇంటర్నల్ ఓబ్లిక్ మసిల్ టియర్కు గురయ్యాడు. జనవరి 10న వడోదరలోని BCA Stadiumలో జరిగిన ట్రైనింగ్ సెషన్లో ఈ గాయమైంది. నెట్స్లో మంచి ఫామ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక త్రోడౌన్ బంతి అతని కుడి నడుము పైభాగాన్ని తాకింది. వెంటనే నొప్పితో కిందపడగా, టీమ్ ఫిజియో, డాక్టర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అతన్ని పరిశీలించారు.
అప్పట్లో వన్డే జట్టులో కేఎల్ రాహుల్ (KL Rahul) మొదటి ఎంపిక వికెట్ కీపర్ కాగా, పంత్ బ్యాకప్ వికెట్ కీపర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా ఉన్నాడు. జర్నలిస్ట్ అభిషేక్ త్రిపాఠి సమాచారం ప్రకారం, న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను మిస్ అయిన తర్వాత పంత్ పూర్తిగా కోలుకున్నాడు.
🔥 Breaking 🔥
💥 पिछले महीने न्यूजीलैंड के विरुद्ध तीन मैचों की वनडे सीरीज में चोटिल हुए विकेटकीपर रिषभ पंत पूरी तरह से फिट हो गए हैं
💥 वह सभी प्रारूप के लिए उपलब्ध रहेंगे। यही नहीं लखनऊ सुपर जायंट्स के लिए भी ये राहत भरी खबर है क्योंकि वह 26 मार्च से शुरू हो रही इंडियन… pic.twitter.com/BXygRoJ7uR— Abhishek Tripathi / अभिषेक त्रिपाठी (@abhishereporter) February 17, 2026
ఇప్పుడు పంత్ అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు ఫిట్గా ఉన్నాడు. మార్చి 26న ప్రారంభమయ్యే ఐపీఎల్ (Indian Premier League) కు అతను సిద్ధంగా ఉండటం లక్నో ఫ్రాంచైజీకి పెద్ద ఊరటగా నిలిచింది.
28 ఏళ్ల పంత్ కెరీర్ 2022 డిసెంబర్లో జరిగిన తీవ్రమైన కారు ప్రమాదం కారణంగా పెద్ద దెబ్బతింది. ఆ ప్రమాదం తర్వాత అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ నుంచి అతను చాలా కాలం దూరంగా ఉన్నాడు.
తదుపరి కాలంలో కూడా ఫిట్నెస్ సమస్యలు వెంటాడాయి. ఇంగ్లాండ్ పర్యటనలో వేళ్ల గాయం, అలాగే అండర్సన్ – టెండూల్కర్ (Anderson-Tendulkar Trophy) 2025 సందర్భంగా కాలి వేళ్లకు గాయాలు ఎదురయ్యాయి.
ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో ప్లే ఆఫ్స్కు బలమైన కంటెండర్గా కనిపించలేదు. వేలంలో సరైన ఎంపికలు చేయలేకపోవడం వల్ల జట్టు దిగువ స్థానాల్లో ముగుస్తుందని అంతా భావించారు. అంచనాలకంటే కొద్దిగా మెరుగ్గా ఆడినప్పటికీ, మొత్తం సీజన్ ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..