AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs RCB: కేకేఆర్‌ మ్యాచ్‌లో కోహ్లీ కోసం ఎదురుచూస్తోన్న పలు రికార్డులు.. ధోని, రోహిత్‌లకు కూడా సాధ్యం కాలే.. అవేంటో తెలుసా?

KKR vs RCB: దూకుడు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేదు. కానీ, ఈరోజు మ్యాచ్‌లో కోహ్లీ కోసం ఎన్నో రికార్డులు ఎదురుచూస్తున్నాయి. వీటిని ధోనీ, రోహిత్ శర్మ కూడా చేయలేకపోవడం విశేషం.

KKR vs RCB: కేకేఆర్‌ మ్యాచ్‌లో కోహ్లీ కోసం ఎదురుచూస్తోన్న పలు రికార్డులు.. ధోని, రోహిత్‌లకు కూడా సాధ్యం కాలే.. అవేంటో తెలుసా?
Virat Kohli
Venkata Chari
|

Updated on: Sep 20, 2021 | 5:18 PM

Share

Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2021) రెండో దశ రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తో తలపడుతుంది. ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈరోజు మ్యాచ్‌లో పాల్గొన్న వెంటనే ఓ రికార్డును సృష్టిస్తాడు. మ్యాచ్ ముందు, విరాట్ కోహ్లీ ఈ సీజన్ తర్వాత ఆర్‌సీబీ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.

దూకుడు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేదు. ఈసారి ఐపీఎల్ టైటిల్‌ను సాధించేందుకు కోహ్లీ ఎంతోగానో ప్రయత్నిస్తున్నాడు. నేటి మ్యాచ్‌లో కోహ్లీ టార్గెట్‌పై అనేక రికార్డులు ఉన్నాయి. వాటిలో ఒకటి కోహ్లీ ఈ రోజు తన 200 వ ఐపీఎల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ మైలురాయిని సాధించిన ఐదవ ఆటగాడిగా కోహ్లీ రికార్డులు నెలకొల్పనున్నాడు. అతని కంటే ముందు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్, ధోనీ, సురేష్ రైనా, దినేశ్ కార్తీక్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సంఖ్యను చేరుకున్నారు.

ఐపీఎల్‌లో 200వ మ్యాచ్: కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ తన పేరిట మరో అద్భుతమైన రికార్డును నమోదు కానుంది. ఏదైనా ఒక ఐపీఎల్ జట్టు కోసం 200 మ్యాచ్‌లు ఆడిన మొదటి ఆటగాడిగా కోహ్లీ అవతరించనున్నాడు. చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడారు. కానీ, ఎవరూ ఒకే జట్టుతో 200 మ్యాచ్‌లు ఆడలేదు. 2008 నుంచి విరాట్ కోహ్లీ ఆర్‌సీబీలో భాగంగా ఉన్నాడు.

విరాట్ కోహ్లీ @ 10,000: ఇవే కాకుండా, టీ 20 క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేయడానికి కోహ్లీ ఎదురుచూస్తున్నాడు. ఈ రోజు కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 71 పరుగులు చేస్తే టీ 20 చరిత్రలో 10,000 పరుగులు సాధించిన ప్రపంచంలో ఐదవ బ్యాట్స్‌మన్ అవుతాడు. భారత క్రికెటర్లలో మాత్రం తొలి వ్యక్తిగా విరాట్ అవతరించనున్నాడు. విరాట్ కంటే ముందు, వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్, కిరన్ పొలార్డ్, పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ మాలిక్, ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ ఈ రికార్డును చేరుకున్నారు.

అత్యధిక పరుగుల్లో తొలిస్థానం: ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి ఐపీఎల్లో చాలా పరుగులు రాలుతున్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఈ లీగ్‌లో కోహ్లీ 5 సెంచరీలు, 40 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇప్పటివరకు 199 మ్యాచ్‌ల్లో 6,076 పరుగులు పూర్తి చేశాడు. శిఖర్ ధావన్ 5,577 తో రెండో స్థానంలో నిలిచాడు.

Also Read: BCCI: దేశీయ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను పెంచిన బీసీసీఐ.. ఎంత పొందనున్నారో తెలుసా?

Virat Kohli Lamborghini Car: అమ్మకానికి విరాట్ కోహ్లీ మాజీ కారు.. ధరెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

IPL 2021: ఐపీఎల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు.. అత్యధిక సార్లు గెలుచుకుంది వీరే..!