
Royal Challengers Bengaluru vs Gujarat Titans, Qualifier 1: క్రికెట్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ తుది ఘట్టానికి చేరింది. లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు నేడు ధర్మశాలలోని చల్లని వాతావరణంలో, హీట్ మరింత పెంచే పోరాటానికి సిద్ధమయ్యాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం (క్వాలిఫైయర్-2) ఉన్నప్పటికీ, ఎలాగైనా ఇక్కడే విజయం సాధించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.
ఈ సీజన్ అంతటా గుజరాత్ టైటాన్స్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో అద్భుతమైన సమతుల్యతతో కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ జట్టులో ఉన్న ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలింగ్ లైనప్, విధ్వంసకర ఓపెనర్లు ప్రత్యర్థి జట్లకు సింహస్వప్నంగా మారారు.
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం ఏమాత్రం తక్కువ తినలేదు. రన్ మెషీన్ విరాట్ కోహ్లీతో పాటు దేవదత్ పడిక్కల్ సూపర్ ఫామ్లో ఉండటం ఆ జట్టుకు కొండంత బలాన్ని ఇస్తోంది. ఇక బౌలింగ్ విభాగంలో సీనియర్ స్పీడ్స్టర్ భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్ వంటి హేమాహేమీలు ఉండటంతో బెంగళూరు శిబిరం కూడా విజయంపై ధీమాతో ఉంది. రెండు జట్లు సమవుజ్జీలుగా ఉండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నరాల తెగుతోంది.
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ఫలితంపై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన అంచనా ప్రకారం ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్కు విజయావకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని పఠాన్ పేర్కొన్నాడు. గుజరాత్కు 55 శాతం గెలిచే అవకాశాలు ఇవ్వగా, బెంగళూరుకు 45 శాతం ఛాన్స్ ఇచ్చారు. ఈ టోర్నమెంట్లో రెండు జట్లు బలంగా ఉన్నప్పటికీ, గుజరాత్ బౌలింగ్ దళం అత్యంత ప్రమాదకరంగా మారడమే అందుకు కారణమని ఆయన వెల్లడించాడు.
ఇది కూడా చదవండి: IPL 2026 Playoffs: ఎవరు గెలిచినా సరికొత్త చరిత్రే.. అక్కడే ఉంది అసలైన ట్విస్ట్..!
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు మైదాన పరిస్థితులను బట్టి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇర్ఫాన్ పఠాన్ అంచనా వేశాడు. ఒకవేళ గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిస్తే, ముందుగా బౌలింగ్ ఎంచుకుని బెంగళూరును తక్కువ పరుగులకే కట్టడి చేయాలని చూస్తుందని తెలిపాడు. అదే సమయంలో బెంగళూరు టాస్ గెలిస్తే మాత్రం, ధర్మశాల పిచ్పై ఛేజింగ్కే మొగ్గు చూపే అవకాశం ఉందని ఆయన విశ్లేషించాడు. మొత్తానికి ఈ పోరు ఆఖరి బంతి వరకు అభిమానులను కుర్చీ అంచున కూర్చోబెట్టడం ఖాయమని స్పష్టమవుతోంది.
బెంగళూరు మరోసారి ఫైనల్ ఆడనుందా, లేక గుజరాత్ మరోసారి ఫైనల్కు దూసుకెళ్తుందా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. పఠాన్ అంచనాలు ఎలా ఉన్నా.. మైదానంలో ఆరోజే ఎవరు అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారనేదే ముఖ్యం. క్రికెట్ పండగ లాంటి ఈ మ్యాచ్లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..