IPL 2024: బిగ్ షాక్‌.. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌ల నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే

జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత, IPL ప్లేఆఫ్‌లకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని కూడా ECB స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు మే మూడో వారంలోగా స్వదేశానికి చేరుకుంటారు.

IPL 2024: బిగ్ షాక్‌.. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌ల నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
England Players

Updated on: Apr 30, 2024 | 9:29 PM

జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత, IPL ప్లేఆఫ్‌లకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని కూడా ECB స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు మే మూడో వారంలోగా స్వదేశానికి చేరుకుంటారు. ఎందుకంటే మే 22 నుంచి ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన ఆటగాళ్లందరూ ఈ సిరీస్‌లో కనిపిస్తారు. దీంతో ఐపీఎల్ జట్లలోని ఇంగ్లండ్ ఆటగాళ్లు ప్లేఆఫ్ దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. ఎందుకంటే మే 21 నుంచి ప్లేఆఫ్ దశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే 26న జరగనుంది. దీంతో ఐపీఎల్‌ చివరి మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాళ్లు కనిపించరు. మొయిన్ అలీ (CSK), జానీ బెయిర్‌స్టో (పంజాబ్ కింగ్స్), జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), సామ్ కరణ్ (పంజాబ్ కింగ్స్), విల్ జాక్స్ (RCB), లియామ్ లివింగ్‌స్టోన్ (పంజాబ్ కింగ్స్) ), ఫిల్ సాల్ట్ (KKR), రీస్ టాప్లీ (RCB) IPL ప్లేఆఫ్‌ మ్యాచ్ ల నుంచి తప్పుకోనున్నారు.

టీ20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ జట్టు:

జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్.

ఇవి కూడా చదవండి

 టీ20 ప్రపంచ కప్ సన్నాహకాల కోసం..

పాకిస్తాన్ తో నాలుగు మ్యాచ్ ల టీ 20 సిరీస్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us