AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: నా బౌలింగ్‌లో రాజస్థాన్ 40 పరుగులకే ఫసక్: విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎందుకంటే?

Virat Kohli: ఆర్సీబీ, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు కేవలం 10.3 ఓవర్లలో 59 పరుగులకు ఆలౌటైంది. ఇది ఐపీఎల్‌లో రాజస్థాన్‌కు రెండో అత్యల్ప స్కోరు కాగా, ఐపీఎల్‌ హిస్టరీలో మూడో అత్యల్ప స్కోరుగా నమోదైంది.

Video: నా బౌలింగ్‌లో రాజస్థాన్ 40 పరుగులకే ఫసక్: విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎందుకంటే?
Virat Kohli
Venkata Chari
|

Updated on: May 15, 2023 | 3:25 PM

Share

IPL 2023, Virat Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ 12వ లీగ్ మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం, మే 14, జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 112 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం తర్వాత RCB వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ షాకింక్ కామెంట్స్ చేశాడు. నేను బౌలింగ్ చేసి ఉంటే రాజస్థాన్ వాళ్లు 40 పరుగులకే ఆలౌట్ అయ్యేవారంటూ షాక్ ఇచ్చాడు.

ఆర్సీబీ, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు కేవలం 10.3 ఓవర్లలో 59 పరుగులకు ఆలౌటైంది. ఇది ఐపీఎల్‌లో రాజస్థాన్‌కు రెండో అత్యల్ప స్కోరు కాగా, ఐపీఎల్‌ హిస్టరీలో మూడో అత్యల్ప స్కోరుగా నమోదైంది.

ఇవి కూడా చదవండి

అదరగొట్టిన RCB బౌలర్లు..

మ్యాచ్ తర్వాత RCB షేర్ చేసిన వీడియోలో, విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. “నేను బౌలింగ్ చేసి ఉంటే ఆర్ఆర్ ప్లేయర్స్ 40 పరుగులకే ఆలౌట్ అయ్యేవారు” అని చెప్పడం కనిపించింది. మ్యాచ్‌లో RCB బౌలర్లు అద్భుతమైన లయతో కనిపించారు. జట్టు తరపున ఫాస్ట్ బౌలర్ వేన్ పార్నెల్ 3 ఓవర్లలో 10 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు మైకేల్ బ్రేస్‌వెల్, కర్ణ్ శర్మ తలో 2 వికెట్లు తీశారు. బ్రేస్‌వెల్ 3 ఓవర్లలో 16 పరుగులు వెచ్చించగా, కర్ణ్ శర్మ 1.3 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చాడు. మరోవైపు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 2 ఓవర్లలో 10 పరుగులిచ్చి 1 వికెట్, గ్లెన్ మాక్స్ వెల్ 1 ఓవర్లో 3 పరుగులిచ్చి 1 వికెట్ తీశారు.

మళ్లీ ప్లేఆఫ్‌పై RCB చిగురించిన ఆశలు..

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడి ఉంటే ఆ జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించేది. ఈ విజయం తర్వాత ఆ జట్టు 12 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించింది. ఇప్పుడు ఆ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవడం ద్వారా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లో ఓడిపోతే ఎలిమినేట్‌ అవుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..