
IPL 2023 Mini Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ను తీసుకోవాలనుకుంటున్నట్లు భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్కు మయాంక్ అగర్వాల్ కెప్టెన్గా వ్యవహరించడం గమనార్హం. అయితే ఈ సీజన్కు పంజాబ్ ఫ్రాంచైజీ మయాంక్ను విడుదల చేసింది. నవంబర్లో పంజాబ్ కింగ్స్ మయాంక్ స్థానంలో శిఖర్ ధావన్ను కెప్టెన్గా నియమించింది.
సన్రైజర్స్ హైదరాబాద్ రాబోయే సీజన్ కోసం కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్లను కూడా విడుదల చేసింది. ఇటువంటి పరిస్థితిలో, వారికి ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ అవసరం. మయాంక్ కెప్టెన్గా కూడా ఉండగలడు. దీంతోనే ఈ యంగ్ ప్లేయర్ను తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, సన్రైజర్స్ హైదరాబాద్ మయాంక్ అగర్వాల్ను తీసుకోవాలని కోరుకుంటుంది, ఎందుకంటే వారికి కూడా ఒక రకమైన ఓపెనర్ అవసరం. అనుభవజ్ఞుడైన ఆటగాడిగా చాలా ఏళ్లపాటు తమను నడిపించిన కేన్ విలియమ్సన్ ఇంకా ఇన్నింగ్స్లో ఓపెనర్గా రాణిస్తున్నాడు.
స్టార్ స్పోర్ట్స్’గేమ్ ప్లాన్ వేలం స్పెషల్’ షోలో పఠాన్ మాట్లాడుతూ, మయాంక్ అగర్వాల్ జట్టును నడిపించే వ్యక్తి, అతను చాలా స్వేచ్ఛగా ఆడుతాడు. ఆయనను నాయకుడిగా తీసుకోవాలని వారు ఆలోచిస్తుండవచ్చు. కాబట్టి ఏం జరగబోతోందో చూద్దాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
వేలం వివరాల్లోకి వెళితే, మొత్తం పది ఐపీఎల్ జట్లలో హైదరాబాద్ అత్యధికంగా రూ.42.25 కోట్లు కలిగి ఉంది. ఆ తర్వాత రూ.32.2 కోట్లతో పంజాబ్ ఉంది. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా కోసం హైదరాబాద్, పంజాబ్ మధ్య బిడ్డింగ్ వార్ జరుగుతుందని పఠాన్ భావిస్తున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..