AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: యువరాజ్‌ సింగ్‌ రికార్డ్‌ బ్రేక్ చేసిన ఈ ఆటగాడు రిటైర్మెంట్‌.. ఈ సీజన్ ఐపీఎల్‌ ఆడటం లేదు..?

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరగనుంది. ఈ వేలంలో చాలా మంది పెద్ద ఆటగాళ్లు పాల్గొంటున్నారు.

IPL 2022: యువరాజ్‌ సింగ్‌ రికార్డ్‌ బ్రేక్ చేసిన ఈ ఆటగాడు రిటైర్మెంట్‌.. ఈ సీజన్ ఐపీఎల్‌ ఆడటం లేదు..?
Chris Morris
uppula Raju
|

Updated on: Feb 11, 2022 | 9:30 AM

Share

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరగనుంది. ఈ వేలంలో చాలా మంది పెద్ద ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఫ్రాంచైజీలు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ ఆటగాడు అత్యధిక ధరకు అమ్ముడవుతాడనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. గతేడాది దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2021 సీజన్ కోసం వేలం నిర్వహించినప్పుడు కొంతమంది విదేశీ ఆటగాళ్లు భారీ ధర పలికారు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్‌ను 15 కోట్లకు, ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను 14.25 కోట్లకు ఆర్‌సిబి కొనుగోలు చేసింది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్‌సన్‌14 కోట్లు కొల్లగొట్టాడు.

బేస్ ధర కంటే 20 రెట్లు ఎక్కువ

వేలానికి ముందు క్రిస్ మోరిస్ తన ప్రాథమిక ధరను కేవలం రూ.75 లక్షలు మాత్రమే ఉంచాడు. అయితే అతని పేరు వచ్చిన వెంటనే జట్లలో కలకలం రేగింది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, పంజాబ్ కింగ్స్ బిడ్‌లో నిలిచారు. మోరిస్‌ను రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా రూ.16.25 కోట్లతో కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మోరిస్‌ నిలిచాడు. అంటే బేస్ ధర కంటే 20 రెట్లు ఎక్కువ. 2015లో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.16 కోట్లకు కొనుగోలు చేసిన భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు.

దీనికి ఒక సంవత్సరం ముందు కూడా మోరిస్‌ చాలా డబ్బు సంపాదించాడు. 2020 వేలంలో RCB అతన్ని 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఫ్రాంచైజీ కేవలం ఒక సీజన్ తర్వాత అతనిని విడుదల చేసింది. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ కేవలం ఒక సీజన్ తర్వాత విడుదల చేసింది. ఈ సీజన్‌లో రాజస్థాన్ తరఫున మారిస్ మోరిస్‌ 11 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 15 వికెట్లు పడగొట్టగా కేవలం 67 పరుగులు మాత్రమే చేశాడు.

8 ఏళ్లలో 4 జట్ల రికార్డు ఇదే

దక్షిణాఫ్రికాకు చెందిన ఈ ఆల్ రౌండర్ ఇప్పటి వరకు 8 ఐపీఎల్ సీజన్‌లలో భాగమయ్యాడు. 4 విభిన్న ఫ్రాంచైజీల కోసం ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తరపున మొత్తం 81 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 24 సగటుతో 95 వికెట్లు, 8 చొప్పున పరుగులు ఇచ్చాడు.155 స్ట్రైక్ రేట్‌తో 618 పరుగులు చేశాడు. మోరిస్‌ గత నెలలో అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సంవత్సరం IPL కూడా ఆడటం లేదు.

IND vs WI 3rd ODI: నేడు భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే.. జట్టులో స్వల్ప మార్పులు..

Aloe vera: కలబంద సాగుతో మంచి లాభాలు.. తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం..

IPL 2022: ధోని అతడి కోసం 9.25 కోట్లు వెచ్చించాడు.. కానీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు..?