AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ధోని అతడి కోసం 9.25 కోట్లు వెచ్చించాడు.. కానీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు..?

IPL 2022: IPL 2022 మెగా వేలం దగ్గరపడుతోంది.10 జట్లు బలమైన ఆటగాళ్లని విక్రయించడానికి సిద్దంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం మాదిరే ఈసారి కూడా పెద్ద ఆటగాళ్ల కోసం అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేయనున్నారు. గతేడాది

IPL 2022: ధోని అతడి కోసం 9.25 కోట్లు వెచ్చించాడు.. కానీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు..?
Krishnappa Gowtham
uppula Raju
|

Updated on: Feb 09, 2022 | 1:48 PM

Share

IPL 2022: IPL 2022 మెగా వేలం దగ్గరపడుతోంది.10 జట్లు బలమైన ఆటగాళ్లని విక్రయించడానికి సిద్దంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం మాదిరే ఈసారి కూడా పెద్ద ఆటగాళ్ల కోసం అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేయనున్నారు. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ కృష్ణప్ప గౌతమ్ కోసం రూ.9.25 కోట్లు ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. కర్నాటకకు చెందిన ఈ ఆల్‌రౌండర్‌ కోసం ధోనీ బృందం గట్టి పోటీనిచ్చింది. గౌతమ్‌ను కొనుగోలు చేసేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది.

ముందుగా గౌతమ్‌ను కొనుగోలు చేసేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య గొడవ జరిగింది. రెండు జట్లూ గౌతమ్‌ను రూ.7.5 కోట్ల వరకు వేలం వేసాయి. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ బిడ్‌లోకి ప్రవేశించి చివరకు గౌతమ్‌ను 9.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ విధంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా గౌతమ్ నిలిచాడు. ఐపీఎల్ 2018లో ముంబై ఇండియన్స్ రూ. 8.8 కోట్లు చెల్లించి క్రునాల్ పాండ్యాని కొనుగోలు చేసింది. ఈ రికార్డును కృష్ణప్ప గౌతమ్ బద్దలు కొట్టాడు. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పవన్ నేగిని రూ.8.5 కోట్లకు కొనుగోలు చేసింది.

కృష్ణప్ప గౌతమ్ గురించి మాట్లాడినట్లయితే చెన్నై సూపర్ కింగ్స్ అతనిని 9.25 కోట్లకు కొనుగోలు చేసింది కానీ IPL 2021 మొత్తం సీజన్‌లో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. దీని తర్వాత గౌతమ్ శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. గత ఏడాది అత్యంత ఖరీదైన ఐదుగురు ఆటగాళ్లలో నలుగురు విదేశీ ఆటగాళ్లు, ఒక భారతీయుడు ఉన్నారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు ఆటగాళ్లు, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, భారత్‌ల నుంచి ఒకరి చొప్పున ఉన్నారు. IPL 2021 వేలంలో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్‌పై అత్యధిక డబ్బు ఖర్చు చేశారు. దీని తర్వాత కివీస్ ఆల్ రౌండర్ కైల్ జేమ్సన్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఝై రిచర్డ్‌సన్, గ్లెన్ మాక్స్‌వెల్ ఉన్నారు. ఐదో స్థానంలో కృష్ణప్ప గౌతమ్ నిలిచాడు.

IPL 2022: సచిన్‌ కారణంగా ధోని మిస్సయ్యాడు.. లేదంటే ముంబై ఇండియన్స్‌ ఐకాన్ ప్లేయర్..?

Viral Photos: ఓరి దేవుడా.. ఈ మహిళ అలా కనిపించడం కోసం ఎంత పనిచేసిందంటే..?

Saliva Test: లాలాజల టెస్ట్‌తో క్యాన్సర్, డయాబెటీస్‌ గుర్తింపు.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..?