AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు.. మూడు ఇన్నింగ్స్‌ల్లో 3 సార్లు 5 వికెట్లు, ఇందులో ఓ హ్యాట్రిక్.. అయినా బీసీసీఐ కరుణించట్లే

Indian Cricket Team: ఈ ఆటగాడు 2008లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఆ తర్వాత కోహ్లీ కెప్టెన్సీలో భారత్‌కు అరంగేట్రం చేశాడు. కానీ,

5 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు.. మూడు ఇన్నింగ్స్‌ల్లో 3 సార్లు 5 వికెట్లు, ఇందులో ఓ హ్యాట్రిక్.. అయినా బీసీసీఐ కరుణించట్లే
Siddarth Kaul
Venkata Chari
|

Updated on: Mar 02, 2022 | 11:34 AM

Share

భారత జట్టు (Indian Cricket Team)లోకి ఎంపిక కాకపోవడంపై ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్(Siddarth Kaul) తన బాధను వ్యక్తం చేశాడు. కంటిన్యూగా పెర్ఫార్మెన్స్ చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతోందని వాపోయాడు. సిద్ధార్థ్ కౌల్ భారత్ తరఫున మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడాడు. వన్డేల్లో ఒక్క వికెట్ కూడా పడలేదు. కానీ, టీ20లో నాలుగు వికెట్లు తీశాడు. అయితే, కౌల్‌కు ఇంతకు మించి ఆడే అవకాశాలు రాలేదు. అతను 2008లో అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీని విరాట్ కోహ్లీ సారథ్యంలో గెలుచుకుంది. ఆ తర్వాత భారత సీనియర్‌ జట్టుకు కోహ్లీ(Virat Kohli) కెప్టెన్‌గా మారాడు. కానీ, కౌల్‌కి మాత్రం టీమ్‌ఇండియాలో నిరంతరం ఆడాలనుకోవడం కలగానే మారింది.

స్పోర్ట్స్ యారీతో సంభాషణలో, సిద్ధార్థ్ కౌల్ మాట్లాడుతూ, ఐపీఎల్‌తో పాటు, దేశవాళీ క్రికెట్‌ను కూడా ఎంపికలో కొలమానంగా పరిగణించాలని అన్నాడు. ఐపీఎల్ ఆడని కొందరు ఆటగాళ్లు బాగా రాణిస్తారు. కాబట్టి, దేశీయ క్రికెట్‌కు కొలమానం కావాలి. వారు ఏ పర్యటనలోనూ భాగం కాలేరు. నేను ఇప్పుడు క్వారంటైన్‌లో ఉన్నాను. లేకుంటే రంజీ ట్రోఫీ ఆడేవాడిని. గతేడాది నా ట్రాక్ రికార్డును పరిశీలిస్తే.. ఐదు మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు తీశాను. వీటిలో మూడు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, హ్యాట్రిక్ ఉన్నాయి. టర్నింగ్ ట్రాక్‌లో, నేను రెండు ఐదు వికెట్లు తీసుకున్నాను. పచ్చటి గడ్డి ఉన్న పిచ్‌పై ఒకసారి ఇది జరిగింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. నేను ఇండియా ఏ లో కూడా ఎంపిక కాలేదు.

IPL 2022లో సిద్ధార్థ్ RCB తరపున బరిలోకి.. ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున సిద్ధార్థ్ కౌల్ ఆడనున్నాడు. అతను గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. ఈ 31 ఏళ్ల ఆటగాడు ఏలాంటి పరిస్థితులు ఎదురైనా తన అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకుంటున్నాడని నమ్ముతున్నాడు.

‘ప్రదర్శన చేయడమే నా పని. ఇలా చేస్తే నా పని నేను చేశాననే తృప్తి కలుగుతుంది. నన్ను ఎంపిక చేయాలా వద్దా అనేది సెలక్టర్ల పని. నేను నా పని చేశానని తెలిసి సంతోషిస్తాను. అవును, నేను చేయలేకపోతే నన్ను విమర్శించండి. నేను ఆడటం కొనసాగిస్తాను. ఎందుకంటే నా ఆట ఆధారంగానే నేను టీమ్ ఇండియాలో ఎంపిక అవుతాను’ అంటూ పేర్కొన్నాడు.

‘నాకు గాడ్ ఫాదర్ లేరు. నా పక్షం వహించమని అడిగే చాలా మంది శ్రేయోభిలాషులు నాకు లేరు. నేను ఆడుతున్నప్పుడు సిద్ధార్థ్‌ కౌల్‌ని చూడండి అని ఎవరూ అనలేదు. నా గురించి ఏమీ లేదు. నేను బాగా ఆడాను. అప్పుడే ఇంగ్లాండ్ టూర్‌కు ఎంపికయ్యాను’ అంటూ వాపోయాడు.

Also Read: MS Dhoni: విన్‌జో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోని.. ఇండియాను గేమింగ్ పవర్‌హౌస్‌గా మార్చేస్తామంటూ ప్రకటన..

72 గంటల పాటు ఏకధాటిగా బ్యాటింగ్.. ప్రపంచ రికార్డు సృష్టించిన 19 ఏళ్ల భారత క్రికెటర్..