AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs SA: భారత్‌కు తప్పని ఓటమి.. 4 వికెట్ల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా..

దక్షిణాఫ్రికాతో జగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఆదివారం కటక్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది...

IND Vs SA: భారత్‌కు తప్పని ఓటమి.. 4 వికెట్ల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా..
IND Vs SA
Srinivas Chekkilla
|

Updated on: Jun 12, 2022 | 11:05 PM

Share

దక్షిణాఫ్రికాతో జగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఆదివారం కటక్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ఓపెనర్​ రుజురాజ్​ గైక్వాడ్​ ఒక్క పరుగు చేసి వెనుతిరగా.. ఇషాన్​ కిషన్​ 21 బంతుల్లో 34 చేసి పెవిలియన్ చేరాడు. శ్రేయస్​ అయ్యర్ 40(35), దినేశ్​ కార్తిక్​ 30(21) మినహా ఇతర ఆటగాళ్లు చాలా స్వల్ప స్కోరు చేసి వెనుదిరిగారు.

లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. హెన్రిచ్‌ క్లాసెన్ 81, తెంబా బవుమా 35 రాణించారు. దక్షిణాఫ్రికా మిగతా బ్యాటర్లలో హెండ్రిక్స్‌ (4), ప్రిటోరియస్ (4), డసెస్‌ (1), పార్నెల్‌ (1) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. డేవిడ్ మిల్లర్‌ (20), రబాడ (0) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హర్షల్‌ పటేల్, చాహల్‌ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దక్షిణాఫ్రికా దూసుకెళ్లింది. వైజాగ్‌ వేదికగా మంగళవారం మూడో టీ20 జరగనుంది.