T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ స్టార్ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు

ప్రతిష్ఠాత్మక T20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు అమెరికా ఫ్లైట్ ఎక్కనుంది. వీరితో పాటు నలుగురు ప్లేయర్లను రిజర్వ్‌ గా ఉంచారు. అయితే ఇదే తుది జట్టు కాదు. ఎందుకంటే మే 25 వరకు జట్టులో మార్పులు చేసుకునేందుకు అన్ని జట్లకు అవకాశం ఉంది

T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ స్టార్ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
Team India

Updated on: May 02, 2024 | 5:04 PM

ప్రతిష్ఠాత్మక T20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు అమెరికా ఫ్లైట్ ఎక్కనుంది. వీరితో పాటు నలుగురు ప్లేయర్లను రిజర్వ్‌ గా ఉంచారు. అయితే ఇదే తుది జట్టు కాదు. ఎందుకంటే మే 25 వరకు జట్టులో మార్పులు చేసుకునేందుకు అన్ని జట్లకు అవకాశం ఉంది. అంటే టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి వారం రోజుల ముందు జట్టులో మార్పు రావచ్చు. దీని తర్వాత, గాయం సమస్య లేదా ఇతర కారణాల వల్ల భర్తీ చేసే ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే అలాంటి మార్పుకు ముందు ఐసీసీ టెక్నికల్ కమిటీ అనుమతి తీసుకోవాలి. ఈ కారణంగానే బీసీసీఐ సెలక్షన్ కమిటీ నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను ఎంపిక చేసింది. అంటే ఐపీఎల్‌లో ఎవరైనా ఆటగాడు చాలా పేలవంగా రాణిస్తే జట్టు నుంచి తప్పుకుంటారు. గతంలో కూడా టీమ్ ఇండియా ఇలాంటి మార్పులు చేసింది. ఉదాహరణకు అక్షర్ పటేల్ 2021 టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ఇంకా రోజులు మాత్రమే ఉన్న సమయంలో రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో ఉన్న శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం కల్పించారు. అలాగే అక్షర్ పటేల్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

అందుకే టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే భారత జట్టులో మరికొన్ని మార్పులు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈసారి చివరి క్షణంలో ఎవరికి అవకాశం దక్కుతుందో వేచి చూడాలి. ముఖ్యంగా ప్రస్తుతం రిజర్వ్ కేటగిరలో ఉన్న టీమిండియా ప్రిన్స్ శుభ్ మన్ గిల్ అలాగే టీమిండియా నయా ఫినిషర్ రింకూసింగ్ లకు ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పుకోవచ్చ. ఎందుకంటే వీరికి మెయిన్ జట్టులో చోటు దక్కాల్సిందని చాలామంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్ వీరు ఓ మోస్తరుగా రాణించినా మెయిన్ జట్టులో చోటు దక్కించుకోవచ్చు. అలాగే టీమిండియా సొగసరి బ్యాటర్ కేఎల్ రాహుల్ కు కూడా అన్యాయం జరిగిందని భావిస్తారు. కాబట్టి అతనికి కూడా ఇది మంచి అవకాశం.

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
రిజర్వ్‌లు: శుభమన్ గిల్, అవేష్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us