AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా టీ20 కెప్టెన్సీలో భారీ మార్పు.. సూర్యకు షాక్.. కొత్త సారథిగా ఎవరంటే?

భారత టీ20 క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల కోసం భారత జట్టు సారథ్య బాధ్యతల్లో కీలక మార్పులు చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోవడంతో, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శామ్సన్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం భారత క్రికెట్ భవిష్యత్తును మార్చేలా ఉంది.

టీమిండియా టీ20 కెప్టెన్సీలో భారీ మార్పు.. సూర్యకు షాక్.. కొత్త సారథిగా ఎవరంటే?
Team India
Venkata Chari
|

Updated on: May 09, 2026 | 4:49 PM

Share

తాజా నివేదికల ప్రకారం, టీమ్ ఇండియా తదుపరి టీ20 కెప్టెన్‌గా సంజూ శామ్సన్ పేరును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇటీవలి కాలంలో సంజూ ప్రదర్శన అత్యద్భుతంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్‌పై 97 పరుగులు, అలాగే ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌ల్లో వరుసగా 89 పరుగులతో రాణించి జట్టును గెలిపించిన తీరు సెలక్టర్లను కట్టిపడేసింది. మైదానంలో ఆయన ప్రశాంతత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం సంజూను కెప్టెన్సీ రేసులో నిలబెట్టాయి.

సూర్యకుమార్ యాదవ్‌పై పెరిగిన ఒత్తిడి..

ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌కు మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో ఆయన బ్యాటింగ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. కెప్టెన్ అయ్యాక ఆడిన 52 మ్యాచ్‌ల్లో కేవలం 1232 పరుగులు మాత్రమే చేయడం ఆయన స్థాయికి తక్కువగా పరిగణించబడుతోంది. దీనికి తోడు పెరుగుతున్న వయస్సు, తరచుగా వేధిస్తున్న మణికట్టు గాయాలు సెలక్టర్లను పునరాలోచనలో పడేశాయి. ఒకవేళ సూర్యను కెప్టెన్‌గా కొనసాగించినా, సంజూ శామ్సన్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించి భవిష్యత్తు నాయకుడిగా తీర్చిదిద్దాలని బోర్డు భావిస్తోంది.

శ్రేయస్ అయ్యర్ వెనుకబడటానికి కారణం ఇదే..!

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలిపిన రికార్డు ఉన్నప్పటికీ, శ్రేయస్ అయ్యర్ జాతీయ టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా లేకపోవడం ఆయనకు మైనస్ అయింది. జట్టులో సుస్థిర స్థానం లేని ఆటగాడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం సరైనది కాదని సెలక్టర్ల భావన. అందుకే అద్భుతమైన ఐపీఎల్ రికార్డు ఉన్నా, ప్రస్తుతానికి సంజూ శామ్సన్ కంటే అయ్యర్ వెనుకబడిపోయారు.

భవిష్యత్తు ప్రణాళికలు..

రాబోయే ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్‌లు భారత క్రికెట్‌లో కొత్త నాయకత్వానికి పునాది వేయనున్నాయి. యువ ఆటగాళ్లకు ప్రాధాన్యతనిస్తూ, 2028 ఒలింపిక్స్, తదుపరి ప్రపంచకప్ లక్ష్యంగా బలమైన జట్టును నిర్మించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో సంజూ శామ్సన్ లేదా సూర్యకుమార్ యాదవ్.. వీరిలో ఎవరు జట్టును ముందుండి నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us