IND vs ZIM, 3rd T20I: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్, జింబాబ్వే మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనింగ్ జోడీలో మార్పు చేయగా, గిల్తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. పవర్ప్లేలో ఇద్దరూ వేగంగా స్కోరు చేశారు. 6 ఓవర్లు ముగిసేసరికి టీమ్ ఇండియా స్కోరు 55 పరుగులు కాగా, మిడిల్ ఓవర్లలో జట్టు రన్ రేట్ పడిపోవడంతో 182 పరుగులకే చేరుకోగలిగింది.
కెప్టెన్ శుభ్మన్ గిల్ 50 బంతుల్లో 66 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరీస్లో గిల్ తొలి అర్ధశతకం సాధించాడు. రుతురాజ్ గైక్వాడ్ 49 పరుగులు చేసి ఒక పరుగు తేడాతో హాఫ్ సెంచరీకి దూరమయ్యాడు. గత మ్యాచ్లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ 10 పరుగులు మాత్రమే చేశాడు. యశస్వి జైస్వాల్ (36 పరుగులు) రెండు లైఫ్లు అందుకున్న తర్వాత మూడోసారి క్యాచ్ ఔట్ అయ్యాడు.
ప్రస్తుతం జింబాబ్వే 13 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే జట్టులో సగం మంది పెవిలియన్కు చేరుకున్నారు. వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. అతను జోనాథన్ క్యాంప్బెల్, సికందర్ రజాలను పెవిలియన్కు పంపాడు. పవర్ప్లేలో జింబాబ్వే 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు వెస్లీ మాధవరే, బ్రియాన్ బెన్నెట్లను అవేష్ ఖాన్ అవుట్ చేశాడు. ఖలీల్ అహ్మద్ తడివనాశే మారుమని పెవిలియన్ పంపాడు.
Innings Break!
Captain @ShubmanGill top-scores with 66(49) as #TeamIndia post 182/4 in the first innings 💪
Over to our bowlers 🙌
Scorecard ▶️ https://t.co/FiBMpdYQbc#ZIMvIND pic.twitter.com/6q46FzzkgP
— BCCI (@BCCI) July 10, 2024
భారత్: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్.
జింబాబ్వే: అలెగ్జాండర్ రజా (కెప్టెన్), తాడివనాషే మారుమణి, వెస్లీ మాధవరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, జోనాథన్ క్యాంప్బెల్, క్లైవ్ మదాండే (వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరావా, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..