IND vs PAK: పాకిస్తాన్‌పై డేంజరస్ బ్యాటర్.. బ్యాట్ రఫ్ఫాడిస్తే.. టీమిండియా విజయం పక్కా..

Asia Cup 2023: పాక్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన తుఫాన్ బ్యాటింగ్‌తో భారీ స్కోరు సాధిస్తే.. టీమిండియా మళ్లీ గెలవడం దాదాపు ఖాయమే. భారత్, పాకిస్థాన్ జట్లు (IND VS PAK) 10 నెలల తర్వాత ముఖాముఖిగా తలపడనున్నాయి. చివరిసారిగా 2022 టీ20 ప్రపంచకప్ సందర్భంగా అక్టోబర్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది.

IND vs PAK: పాకిస్తాన్‌పై డేంజరస్ బ్యాటర్.. బ్యాట్ రఫ్ఫాడిస్తే.. టీమిండియా విజయం పక్కా..
India Vs Pakistan

Updated on: Aug 23, 2023 | 1:28 PM

India Vs Pakistan: 2023 ఆసియా కప్ పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లో ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం వన్డే ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. 2023 ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరుగుతుంది. ఆసియా కప్ 2023లో సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఆసియా కప్ గెలవడానికి భారత్ బలమైన పోటీదారుగా పరిగణిస్తున్నారు.

ఆసియా కప్ చరిత్రలో భారత్ అత్యధికంగా 7 సార్లు టైటిల్ గెలుచుకుంది. భారత్ తర్వాత అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్ నెగ్గిన రికార్డు శ్రీలంక పేరిటే నమోదైంది. శ్రీలంక 6 సార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2023 ఆసియా కప్‌లో భారత్‌తో జరిగే మెగా మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కాకుండా ఒక ఆటగాడి నుంచి పాకిస్తాన్ జట్టు అతిపెద్ద ముప్పును ఎదుర్కొంటుంది. ఈ ఆటగాడు మరెవరో కాదు, భారత స్టార్ పేలుడు ఓపెనర్, కెప్టెన్ ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ. ఆసియాకప్‌లో పాక్‌ జట్టుకు కోహ్లీ కంటే రోహిత్‌ వల్లే ఎక్కువ ముప్పు వాటిల్లనుంది. రోహిత్ శర్మ వేగంగా పరుగులు సాధిస్తే ఆటలో భారీ మార్పు వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆసియాకప్ లో రోహిత్ భాగస్వామ్యం..

ఓడిపోయే మ్యాచ్‌లను తిప్పికొట్టడంలో నేర్పరి..

ఆసియా కప్ 2023లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలు ఓపెనింగ్‌కు దిగవచ్చు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 3వ నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగవచ్చు. స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగవచ్చు. వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మ చాలా ప్రమాదకరమైన ఆటగాడు. వన్డేల్లో రోహిత్ శర్మ 30 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు సాధించాడు.

గెలవడం దాదాపు ఖాయమే..


పాక్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన తుఫాన్ బ్యాటింగ్‌తో భారీ స్కోరు సాధిస్తే.. టీమిండియా మళ్లీ గెలవడం దాదాపు ఖాయమే. భారత్, పాకిస్థాన్ జట్లు (IND VS PAK) 10 నెలల తర్వాత ముఖాముఖిగా తలపడనున్నాయి. చివరిసారిగా 2022 టీ20 ప్రపంచకప్ సందర్భంగా అక్టోబర్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది.

రోహిత్ భారీ సిక్సర్ వీడియో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..