Aisa Cup 2025: ఇదేం ఖర్మరా.. ఒక్క తప్పుతో పాక్ పరువు అడ్డంగా పాయే.. అదేంటంటే?

DJ Plays Jalebi Baby Instead of Pakistan National Anthem: ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు దేశాల జాతీయ గీతాలను ప్లే చేసే సమయంలో, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో డీజే పొరపాటున పాకిస్తాన్ జాతీయ గీతానికి బదులుగా 'జలేబి బేబీ' అనే పాప్ పాటను ప్లే చేశాడు.

Aisa Cup 2025: ఇదేం ఖర్మరా.. ఒక్క తప్పుతో పాక్ పరువు అడ్డంగా పాయే.. అదేంటంటే?
Pakistan National Anthem

Updated on: Sep 15, 2025 | 9:34 AM

DJ Plays Jalebi Baby Instead of Pakistan National Anthem: క్రికెట్ ప్రపంచంలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఒక ఆట కాదు. అది దేశాల ఆత్మగౌరవం, అభిమానుల భావోద్వేగాల సమ్మేళనం. ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కూడా దీనికి మినహాయింపు కాదు. అయితే, ఈసారి మ్యాచ్‌ మొదలు కాకముందే ఊహించని ఒక సంఘటన జరిగింది. అదే.. డీజే చేసిన పొరపాటు.

ఇవి కూడా చదవండి

మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్ళు వారి వారి జాతీయ గీతాల కోసం మైదానంలో నిలబడ్డారు. ముందుగా పాకిస్తాన్ జాతీయ గీతం ప్లే చేయాల్సి ఉంది. అయితే, స్టేడియం డీజే పొరపాటున పాక్ జాతీయ గీతానికి బదులు ప్రముఖ సింగర్ టెషర్ పాడిన ‘జలేబి బేబీ’ అనే పాటను ప్లే చేశాడు. ఈ పాట దాదాపు ఆరు సెకన్ల పాటు వినిపించింది. దీంతో పాకిస్తాన్ ఆటగాళ్ళు, మైదానంలో ఉన్న అభిమానులు గందరగోళానికి గురయ్యారు. కొంతమంది ఆటగాళ్ళు ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

వెంటనే డీజే తన పొరపాటును గుర్తించి, పాటను ఆపివేసి, పాకిస్తాన్ జాతీయ గీతాన్ని ప్లే చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై రకరకాల మీమ్స్‌, కామెంట్లు పెడుతూ నవ్వుకున్నారు.

నిజానికి, అంతకుముందు టాస్ సమయంలో కూడా ఇరు జట్ల కెప్టెన్‌లు సూర్యకుమార్ యాదవ్, సల్మాన్ అలీ ఆఘా కరచాలనం చేసుకోకపోవడంతో మ్యాచ్ ఉద్రిక్త వాతావరణంలో ప్రారంభమవుతుందనే సంకేతాలు కనిపించాయి. కానీ, ఈ జాతీయ గీతం సంఘటన ఆ తీవ్రతను కాస్త తగ్గించింది.

ఈ సంఘటన గురించి పాకిస్తాన్ జట్టు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ, ఆటగాళ్ళు చాలా ఇబ్బందిపడ్డారని వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆటలో ఇలాంటి పొరపాట్లు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లలో జాతీయ గీతాల విషయంలో పొరపాట్లు జరిగాయి. కానీ, ఇండియా-పాకిస్తాన్ వంటి ఉద్రిక్త మ్యాచ్‌లలో ఇలాంటివి జరిగినప్పుడు వాటి ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. ఈ సంఘటన తర్వాత, మ్యాచ్‌పై దృష్టి సారించిన పాకిస్తాన్ జట్టు, ఇండియా బౌలర్ల ధాటికి తక్కువ స్కోరుకే కుప్పకూలింది.

మొత్తానికి, ‘జలేబి బేబీ’ పాట అనుకోకుండా ఈ ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఒక హాస్యభరితమైన అధ్యాయంగా నిలిచిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..