ICC U19 World Cup: వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన భారత్.. ఆస్ట్రేలియాపై ఘన విజయం..!

|

Feb 03, 2022 | 8:50 AM

IND vs ENG: అండర్ 19 ప్రపంచకప్‌లో భారత జట్టు వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.

ICC U19 World Cup:  వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన భారత్.. ఆస్ట్రేలియాపై ఘన విజయం..!
U19 World Cup Teamindia
Follow us on

ICC U19 World Cup: వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్(U19 World Cup) సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత జట్టు 96 పరుగుల భారీ విజయంతో ఫైనల్‌కు చేరుకుంది. ఆ జట్టు ఫైనల్‌కు చేరడం వరుసగా ఇది నాలుగోసారి. ఆంటిగ్వాలోని కూలీస్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ , కెప్టెన్ యష్ ధుల్ (Yash Dhull), షేక్ రషీద్(Sheikh Rasheed) అద్భుతమైన భాగస్వామ్యంతో 290 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా జట్టు 194 పరుగులకు పూర్తి 50 ఓవర్లు ఆడకుండానే పెవిలియన్ చేరింది.

అండర్-19 ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు ఫైనల్స్‌కు చేరిన టీంగా భారత్ జట్టు రికార్డు సృష్టించింది. 2000, 2006, 2008, 2012, 2016, 2018, 2020 తర్వాత ఈ ఏడాది కూడా టీమ్‌ఇండియా ఫైనల్‌ టిక్కెట్‌ దక్కించుకుంది. అదే సమయంలో ఇప్పటివరకు నాలుగు సార్లు టైటిల్ కూడా గెలుచుకోగలిగింది. 2000, 2008, 2012, 2018లో భారత్‌ ప్రపంచకప్‌ గెలిచింది. ఈసారి ఫైనల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది.

నిరాశ పరిచిన ఓపెనింగ్ జోడీ..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఎనిమిదో ఓవర్లో 16 పరుగుల వద్ద ఫామ్ లో ఉన్న ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ (6) వికెట్ కోల్పోయింది. విలియం సాల్జ్‌మాన్ (57 పరుగులకు 2 వికెట్లు) బౌలింగ్‌లో రఘువంశీ ఔటయ్యాడు. రెండో ఓపెనర్ హర్నూర్ సింగ్ (16) కూడా ఎక్కువసేపు నిలవలేకపోవడంతో భారత్‌కు 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

ధుల్, రషీద్‌ల డబుల్ సెంచరీ భాగస్వామ్యం..
ధుల్‌, రషీద్‌లు సంయమనం పాటించి భారత్‌ను భారీ స్కోరు దిశగా నడిపించారు. ఈ సమయంలో, ధుల్ తన సెంచరీని పూర్తి చేశాడు. అయితే రషీద్ ఆరు పరుగుల తేడాతో 100 పరుగులు చేయడంలో తప్పుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో కెప్టెన్ ధుల్ రనౌట్ అయ్యాడు. 46వ ఓవర్‌లో అతను ఔటయ్యాడు. 110 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో పరుగులు సాధించాడు.

ఆ తర్వాతి బంతికే రషీద్ వికెట్ కూడా కోల్పోయాడు. జట్టు స్కోరు 241 పరుగుల వద్ద అతను జాక్ నిస్బెట్ (తొమ్మిది ఓవర్లలో ఒక మెయిడిన్ 41 పరుగులకు రెండు వికెట్లు) బంతికి బలి అయ్యాడు. 108 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 94 పరుగులు చేశాడు. కోవిడ్ -19 నుంచి కోలుకున్న తర్వాత ఈ మ్యాచ్‌కు తిరిగి వచ్చిన నిశాంత్ సింధు 12 (ఒక ఫోర్, ఒక సిక్స్)తో నాటౌట్‌గా ఉన్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ 20 పరుగులు (నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు) చేశాడు.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 194 పరుగులకే కుప్పకూలింది..
అనంతరం ఆస్ట్రేలియా జట్టు 194 పరుగులకే ఆలౌటైంది. లాక్లాన్ షా జట్టు తరఫున అత్యధికంగా 51 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు కోరీ మిల్లర్ 38, ఓపెనర్ క్యాంప్‌బెల్ కెల్లావే 30 పరుగులు చేశారు. భారత్ తరఫున విక్కీ ఓస్త్వాల్ మూడు, నిశాంత్ సింధు, రవికుమార్ చెరో రెండు వికెట్లు తీశారు. కౌశల్ తాంబే, అంగ్క్రిష్ రఘువంశీ తలో వికెట్ తీశారు.

Also Read: Indian cricketers : టీమిండియా క్రికెటర్స్ కు కరోనా పాజిటివ్ .. ఆందోళనలో అభిమానులు

ఈ శ్రీలంక పేసర్ రిటైర్మెంట్ ప్రకటించాడు‌.. టీమిండియాపైనే అరంగ్రేటం.. టీమిండియాతోనే ముగింపు..