AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: వామ్మో.. ట్రోఫీతో అమాంతం పెరిగిన టీమిండియా ప్లేయర్ల బ్రాండ్ వాల్యూ.. ఎంతంటే?

Women's World Cup 2025: ఈ ప్రపంచ కప్ విజయం భారత మహిళా క్రీడాకారిణులకు ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఆటతోపాటు ఆర్ధికంగా కూడా వారు పురుషుల క్రికెటర్ల మాదిరిగానే తమ ప్రభావాన్ని చూపడానికి ఈ విజయం ఒక బలమైన పునాదిని వేసింది.

Team India: వామ్మో.. ట్రోఫీతో అమాంతం పెరిగిన టీమిండియా ప్లేయర్ల బ్రాండ్ వాల్యూ.. ఎంతంటే?
Team India Women Players
Venkata Chari
|

Updated on: Nov 04, 2025 | 11:13 AM

Share

Women’s World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రపంచ కప్ విజయం కేవలం ట్రోఫీని మాత్రమే అందించలేదు, వారి బ్రాండ్ విలువను కూడా అమాంతం పెంచేసింది. దేశవ్యాప్తంగా అపారమైన అభిమానం, ప్రశంసలు దక్కించుకున్న ఈ ‘ఉమెన్ ఇన్ బ్లూ’ టీమ్ సభ్యులు ఇప్పుడు అడ్వర్టైజింగ్ ప్రపంచంలో కొత్త తారలుగా వెలుగుతున్నారు.

బ్రాండ్ ఎండార్స్‌మెంట్లలో భారీ పెరుగుదల..

మహిళల ప్రపంచ కప్ గెలుపు తర్వాత భారత క్రీడాకారిణుల బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజులు 25% నుంచి 100% వరకు పెరిగాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ విజయం రాత్రికి రాత్రే పురుష క్రికెటర్లకు, మహిళా క్రికెటర్లకు మధ్య ఉన్న ఆర్ధిక అంతరాన్ని గణనీయంగా తగ్గించింది.

స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, షఫాలీ వర్మ వంటి స్టార్ ఆటగాళ్ల కోసం బ్రాండ్లు క్యూ కడుతున్నాయి. తాజాగా గెలుపొందిన తర్వాత, క్రీడాకారిణుల సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య కూడా 24 గంటల్లోనే రెట్టింపు లేదా మూడు రెట్లు పెరిగింది.

జెమీమా రోడ్రిగ్స్ ఫీజు రెట్టింపు (100% పెరుగుదల)..

ఈ బ్రాండ్ విలువ పెరుగుదలలో, సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన జెమీమా రోడ్రిగ్స్ ముందంజలో ఉంది.

100% పెరుగుదల: ఆమె బ్రాండ్ విలువ దాదాపు 100 శాతం పెరిగింది అని ఆమెను నిర్వహించే టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ JSW స్పోర్ట్స్ తెలిపింది.

కొత్త ఫీజు: సెమీ-ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే బ్రాండ్‌ల నుంచి విపరీతమైన ఆసక్తి కనిపించింది. నివేదికల ప్రకారం, జెమీమా రోడ్రిగ్స్ ఇప్పుడు ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు రూ. 75 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉంది.

10-12 కేటగిరీల బ్రాండ్‌లు: ఇప్పటికే రెడ్ బుల్, బోట్, నైక్ వంటి బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్న జెమీమా కోసం, 10-12 విభిన్న కేటగిరీలలోని బ్రాండ్‌లతో చర్చలు జరుగుతున్నాయట.

ఇతర ప్లేయర్ల పరిస్థితి..

స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్: ఇప్పటికే 20కి పైగా బ్రాండ్లను ఎండార్స్ చేస్తున్న ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్‌ల ఎండార్స్‌మెంట్ ఫీజులు కూడా 30-50% వరకు పెరిగే అవకాశం ఉంది. వీరి ప్రస్తుత ఫీజు రూ. 60-75 లక్షల వరకు ఉంది.

షఫాలీ వర్మ, దీప్తి శర్మ: యువ తారలైన వీరిద్దరికీ కూడా బ్రాండ్‌ల నుంచి ఎక్కువ ఆసక్తి వ్యక్తమవుతోంది. వీరి ఫీజులు కూడా ఒక్కో బ్రాండ్‌కు రూ. 40-50 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే, ఈ ప్రపంచ కప్ విజయం భారత మహిళా క్రీడాకారిణులకు ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఆటతోపాటు ఆర్ధికంగా కూడా వారు పురుషుల క్రికెటర్ల మాదిరిగానే తమ ప్రభావాన్ని చూపడానికి ఈ విజయం ఒక బలమైన పునాదిని వేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..