Indian Cricketers Who Married Twice: భారతదేశంలో పెళ్లి ప్రాముఖ్యతను అర్థం చేసుకోని వారు ఎవరూ ఉండరు. భారతీయ సంస్కృతిలో వివాహం అత్యంత పవిత్రమైన బంధంగా పరిగణిస్తుంటారు. భారతీయులు ఈ పవిత్ర బంధాన్ని అదే స్ఫూర్తితో, అంకితభావంతో అంగీకరిస్తారు. కానీ, చాలా సార్లు భార్యాభర్తలు ఒకరితో ఒకరు బంధాన్ని సక్రమంగా అర్థం చేసుకోకపోవడంలో విఫలమవుతుంటారు. ఇలాంటి సందర్భంలో కలిసి ఉండలేక విడాకులు తీసుకుంటుంటారు. ఈ క్రమంలో రెండవ పెళ్లి ఆలోచన కూడా తలెత్తుతుంది. ఈ క్రమంలో జీవితంలో రెండుసార్లు వివాహం చేసుకున్న టీమిండియా క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్టులో టాప్ 3 క్రికెటర్లు ఉన్నారు. వారెవరూ ఓసారి చూద్దాం..
దినేష్ కార్తీక్ మొదటి వివాహం సక్సెస్ కాలేదు. ఇది అతని మొదటి భార్య నికితా వంజారాతో అతని వివాహం విడిపోవడానికి దారితీసింది. అతను 2007లో నికితను వివాహం చేసుకున్నాడు. అయితే, అతని భార్య తోటి క్రికెటర్ మురళీ విజయ్తో రిలేషన్ కారణంగా వీరద్దరి సంబంధం తెగిపోయింది. ఆ తర్వాత 2012లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతని రెండవ వివాహం 2015లో మాజీ ప్రపంచ 10వ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్తో జరిగింది. ఇప్పుడు వారిద్దరూ సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.
“మైసూర్ ఎక్స్ప్రెస్”గా ప్రసిద్ధి చెందిన జావగల్ శ్రీనాథ్ కూడా రెండుసార్లు వివాహం చేసుకున్నారు. అతని మొదటి వివాహం 1999లో జ్యోత్స్నతో జరిగింది. అయితే, వారి వివాహం 9 సంవత్సరాల తర్వాత ముగిసింది. కొంతకాలం తర్వాత, అతను జర్నలిస్ట్ మాధవి పాత్రావళిని రెండవ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వారిద్దరూ కలిసి సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.
వినోద్ కాంబ్లీ ఎప్పుడూ రకరకాల కారణాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. అతను మూడు వేర్వేరు దేశాలపై మూడు ఇన్నింగ్స్లలో వరుసగా మూడు టెస్ట్ సెంచరీలు సాధించాడు. అయితే, అతని వ్యక్తిగత జీవితం కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంది. అతని మొదటి వివాహం నోయెల్లా లూయిస్తో జరిగింది. అయితే, ఈ జంట విడిపోయారు. ఆ తర్వాత ఫ్యాషన్ మోడల్ ఆండ్రియా హెవిట్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..