Mohammed Shami Best Friends in Indian Team: వన్డే ప్రపంచకప్లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. మహ్మద్ షమీ బౌలింగ్తో భారత్ వన్డే ప్రపంచకప్లో ఫైనల్కు చేరుకుంది. అయితే, ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు భారత్ను ఓడించి ప్రపంచకప్ కలను నాశనం చేసింది. మహ్మద్ షమీ ప్రపంచకప్లో 7 మ్యాచ్లు ఆడాడు. ఈ 7 మ్యాచ్ల్లో 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ప్రపంచకప్ సందర్భంగా మహ్మద్ షమీ చీలమండకు గాయమైంది. ఆ తర్వాత కొంతకాలం క్రికెట్కు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు మరోసారి నెట్స్లోకి దిగి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
గాయంతో ఐపీఎల్, టీ20 ప్రపంచకప్నకు దూరమైనప్పటికీ మహ్మద్ షమీ మంచి స్థితిలో ఉన్నాడు. ఇటీవల మహ్మద్ షమీ పాడ్కాస్ట్లో కనిపించాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మలు భారత జట్టులో తనకు ఇద్దరు మంచి స్నేహితులున్నారని వెల్లడించాడు.
ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ.. “విరాట్ కోహ్లి, ఇషాంత్ శర్మ నాకు మంచి స్నేహితులు. నేను గాయపడినప్పుడు వారు నాకు ఫోన్ చేసేవారు” అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ సమయంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ పై మహ్మద్ షమీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్లో అర్ష్దీప్ సింగ్ బాల్ ట్యాంపరింగ్ చేశాడని ఇంజమామ్ ఉల్ హక్ ఆరోపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వన్డే ప్రపంచకప్ సందర్భంగా మహమ్మద్ షమీపై కూడా ఈ ఆరోపణలు వచ్చాయి. భారత్కు రకరకాల బంతులు వస్తున్నాయని, వాటిలో డివైజ్లు పెట్టడం షమీకి అదనపు బాలాన్నిస్తోందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు హసన్ రజా అన్నాడు.
‘బాల్ కట్ చేసి అందులో ఏదైనా పరికరం ఉందో లేదో చూపిస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాను.. ఇప్పుడు మరో విమర్శ చేశారు. అర్ష్దీప్ సింగ్కి రివర్స్ స్వింగ్ ఎలా వస్తుందంటూ మాట్లాడుతూన్నారు. ఈ సందర్భంగా ఇంజమామ్ భాయ్కి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఆయనంటే నాకు చాలా గౌరవం. ఇలా చేస్తే బాల్ ట్యాంపరింగ్ కాదా?’ అంటూ షమీ రివర్స్ కౌంటరిచ్చాడు.
వింత ప్రకటనలు చేసి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించవద్దని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లను షమీ కోరాడు. ఫాస్ట్ బౌలర్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్కు కూడా షమీకి మద్దతు పలికిన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..