IND vs ENG 2nd ODI: కటక్‌లో జడేజా ‘తీన్’ మార్.. టీమిండియా ముందు భారీ టార్గెట్..

India vs England 2nd ODI: కటక్‌లోని బారాబాటి స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఆదివారం బారాబాటి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు 304 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టుకు 305 పరుగుల టార్గెట్ చేసింది.

IND vs ENG 2nd ODI: కటక్‌లో జడేజా తీన్ మార్.. టీమిండియా ముందు భారీ టార్గెట్..
Ind Vs Eng 2nd Odi

Updated on: Feb 09, 2025 | 5:23 PM

India vs England 2nd ODI: రెండో వన్డేలో ఇంగ్లాండ్ భారత్ కు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. కటక్‌లోని బారాబాటి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ఇంగ్లాండ్ తరపున బెన్ డకెట్ 65, జో రూట్ 69 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. కెప్టెన్ జోస్ బట్లర్ 34, హ్యారీ బ్రూక్ 31, ఫిల్ సాల్ట్ 26 పరుగులు చేశారు. భారత్ తరపున రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఇవి కూడా చదవండి

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ.

ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జిమ్మీ ఓవర్టన్, మార్క్ వుడ్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..