IPL 2025 final: RCB దెబ్బకి ఎమోషనల్ అయిన ప్రీతీ పాప! ఓదారుస్తున్న నెటిజన్లు
RCB 18 ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ తమ తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ఈ విజయంతో పాటు, పంజాబ్ కింగ్స్ తరపున మరోసారి తృటిలో టైటిల్ చేజారిన బాధ కనిపించింది. సహ యజమాని ప్రీతి జింటా తన భావోద్వేగాలను దాచలేక కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఆమె తన జట్టుకు ధైర్యం చెప్పడం, పోరాట ఆత్మను మెచ్చుకోవడం అభినందనీయం. అయితే, పంజాబ్ కింగ్స్ మాత్రం మరోసారి తృటిలో టైటిల్ను కోల్పోయిన బాధతో నిలిచింది. 2014 తర్వాత ఇది వారి రెండో ఫైనల్. ఈసారి విజయానికి ఎంతో దగ్గరగా వెళ్లి కూడా చేతి దాకా వచ్చిన టైటిల్ను కోల్పోవడం వల్ల కలిగిన బాధ అభిమానులకు తట్టుకోలేనిదిగా మారింది.

2025 ఐపీఎల్ ఫైనల్ రాత్రి నరేంద్ర మోడీ స్టేడియంలో నాటకీయత, భావోద్వేగాలు, అంచనాలు అన్నీ తారాస్థాయిలో కనిపించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తమ తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. కానీ RCB ఈ విజయాన్ని సంబరంగా జరుపుకుంటుండగా, మరోవైపు పంజాబ్ కింగ్స్ (PBKS) శిబిరంలో మాత్రం తీవ్ర నిరాశ కనిపించింది. ముఖ్యంగా సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా భావోద్వేగాలకు లోనై మైదానాన్ని వీడిన దృశ్యం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.
మ్యాచ్ ముగిసిన వెంటనే వైరల్ అయిన వీడియోల్లో ప్రీతి జింటా తెల్లటి కుర్తా, ఎరుపు దుపట్టాలో తీవ్రంగా నిరాశతో కనిపించారు. కేవలం ఆరు పరుగుల తేడాతో మ్యాచ్ను చేజార్చుకోవడం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. ఆమె కళ్ళు మసకబారినట్టుగా, ముఖం నిండా బాధతో మైదానంలో నెమ్మదిగా నడుస్తున్న దృశ్యం అభిమానుల హృదయాలను హత్తుకుంది. కానీ ఓటమి బాధకే పరిమితమవకుండా, ప్రీతి జింటా తన సమర్థతను చూపిస్తూ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్తో పాటు ఇతర ఆటగాళ్లకు ధైర్యం చెప్పారు, వారిని ఓదార్చారు.
ఈ ఫైనల్లో RCB విజయానికి కీలకంగా మారిన కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ లాంటి బౌలర్లు పంజాబ్ కింగ్స్ను 184/7కు పరిమితం చేశారు. 190 పరుగుల లక్ష్యాన్ని కాపాడడంలో వారు అద్భుతంగా రాణించారు. ఈ విజయం ద్వారా RCB ఎట్టకేలకు ఐపీఎల్ చరిత్రలో తమ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఎన్నో సంవత్సరాలుగా టైటిల్ లేకపోయిన ఘన జట్టు ఇప్పుడు చాంపియన్గా నిలిచింది.
అయితే, పంజాబ్ కింగ్స్ మాత్రం మరోసారి తృటిలో టైటిల్ను కోల్పోయిన బాధతో నిలిచింది. 2014 తర్వాత ఇది వారి రెండో ఫైనల్. ఈసారి విజయానికి ఎంతో దగ్గరగా వెళ్లి కూడా చేతి దాకా వచ్చిన టైటిల్ను కోల్పోవడం వల్ల కలిగిన బాధ అభిమానులకు తట్టుకోలేనిదిగా మారింది. ప్రీతి జింటా ముఖంలో ఆ బాధ స్పష్టంగా కనిపించింది. కానీ ఆమె ఆత్మస్థైర్యం, జట్టుపై ప్రేమ, పోరాట ఆత్మవిశ్వాసం అభిమానులకు శక్తినిచ్చింది. PBKS ఫ్యాన్స్కి ఈ ఓటమి తీయని గుర్తుగా మిగిలినా, వారి ప్రదర్శన మాత్రం గుర్తింపు పొందింది.
She's heartbroken again, tears in her eyes.We will see you lifting an IPL trophy soon, next year’s victory will be yours! We believe! ✨#PreityZinta #PBKS #IPL pic.twitter.com/3WsmY2pJmr
— Biswajit Bhowmick (@biswajitshubu) June 3, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



