AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : ఫ్యాన్సుకు షాక్.. ఆర్సీబీకి విరాట్ కోహ్లీ గుడ్ బై.. త్వరలో ఐపీఎల్‎కు కూడా ?

కింగ్ విరాట్ కోహ్లీను మళ్లీ మైదానంలో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ తన సత్తా చాటనున్నాడు. అయితే, ఇది కోహ్లీకి చివరి సిరీస్ అవుతుందా అనే చర్చ కొనసాగుతోంది.

Virat Kohli  : ఫ్యాన్సుకు షాక్.. ఆర్సీబీకి విరాట్ కోహ్లీ గుడ్ బై.. త్వరలో ఐపీఎల్‎కు కూడా ?
Virat Kohli
Rakesh
|

Updated on: Oct 13, 2025 | 10:23 AM

Share

Virat Kohli : టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీను మళ్లీ మైదానంలో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ తన సత్తా చాటనున్నాడు. అయితే, ఇది కోహ్లీకి చివరి సిరీస్ అవుతుందా అనే చర్చ కొనసాగుతోంది. అంతర్జాతీయ క్రికెట్ కాకపోయినా, కనీసం ఐపీఎల్‌లోనైనా అతన్ని చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కానీ, తాజాగా కోహ్లీ తీసుకున్న ఒక నిర్ణయం.. అతని అభిమానుల గుండెల్లో గుబులు రేపుతోంది. తన ఐపీఎల్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన ఒక కాంట్రాక్ట్‌ను కోహ్లీ పునరుద్ధరించడానికి నిరాకరించడం, అతను ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్పే అవకాశం ఉందనే ఊహాగానాలకు బలం చేకూర్చింది.

ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు విరాట్ కోహ్లీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రముఖ యూట్యూబర్ రోహిత్ జుగ్లాన్ ఒక వీడియోలో వెల్లడించిన నివేదిక ప్రకారం.. కోహ్లీ ఒక పెద్ద కంపెనీతో ఉన్న కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించడానికి నిరాకరించాడు. ఈ కాంట్రాక్ట్‌ను ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రెన్యూ చేయాల్సి ఉంది. ఈ కాంట్రాక్ట్ ఐపీఎల్‌కు సంబంధించినది కానప్పటికీ, దీనికి ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఏదో ఒక సంబంధం ఉంది. దీంతో విరాట్ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

కోహ్లీ ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకున్నప్పటి నుంచి, ఇది ఐపీఎల్‌లో అతని ప్రయాణానికి ముగింపు ప్రారంభం కావచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కోహ్లీ మెల్లమెల్లగా ఐపీఎల్ నుంచి దూరమవుతాడని, అతను వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యే రోజున, ఐపీఎల్ కెరీర్‌కు కూడా తెర దించుతాడని నివేదికలు పేర్కొంటున్నాయి. కోహ్లీ గతంలో చాలాసార్లు ఒక విషయం స్పష్టం చేశాడు. తాను ఆర్సీబీని వదిలి వేరే ఫ్రాంచైజీలో చేరబోనని, ఆర్సీబీతోనే ఆడతానని లేదా ఐపీఎల్ నుంచి పూర్తిగా వైదొలుగుతానని చెప్పాడు. 2008లో తొలి ఐపీఎల్ సీజన్ నుంచే కోహ్లీ ఆర్సీబీలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో, తాజా నివేదికలు కోహ్లీతో పాటు ఆర్సీబీ అభిమానుల ఆందోళనను పెంచాయి.

ఐపీఎల్ తదుపరి సీజన్ మార్చి 2026లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్ కోసం ప్లేయర్ల రిటెన్షన్-రిలీజ్ గడువు నవంబర్ 15 కాగా, మినీ వేలం డిసెంబర్ రెండవ లేదా మూడవ వారంలో జరిగే అవకాశం ఉంది. రాబోయే ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యే వరకు విరాట్ కోహ్లీ ప్రతి అడుగును అభిమానులు నిశితంగా గమనించనున్నారు. అయితే, ప్రస్తుతానికి, రాబోయే వన్డే సిరీస్‌లో కోహ్లీ తన ఆటతో అభిమానులకు కాస్త ఉపశమనం అందించే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..