
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నారని చర్చ నడుస్తోంది. 43 ఏళ్ల ధోని ఐపీఎల్లో 5 సార్లు ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. భారత జట్టుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్కు ఎన్నో విజయాలు అందించిన ధోని ప్రస్తుతం తన భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి రాంచీలోని ‘కైలాష్పతి’ ఫామ్హౌస్లో నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ధోని తన కూతురు జీవా చదువుతున్న స్కూల్ గురించి, ఆమె ఫీజు ఎంత చెల్లిస్తున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ధోని కూతురు జీవా ధోని (10 ఏళ్లు) ప్రస్తుతం రాంచీలోని అత్యుత్తమ పాఠశాలల్లో ఒకటైన టౌరియన్ వరల్డ్ స్కూల్ లో చదువుతోంది. ఈ స్కూల్ 2008లో స్థాపించబడి చాలా తక్కువ సమయంలోనే రాంచీలో అత్యుత్తమ విద్యా సంస్థగా గుర్తింపు పొందింది.
ఈ స్కూల్ 65 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. విద్యార్థుల సర్వాంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే విధానం ఇక్కడ అందుబాటులో ఉంది. సేంద్రీయ వ్యవసాయం, గుర్రపు స్వారీ, మానసిక-శారీరక శ్రేయస్సు, అంతర్జాతీయ స్థాయి క్రీడలు వంటి ప్రత్యేక ప్రోగ్రామ్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
ఈ స్కూల్ స్థాపకుడు అమిత్ బజ్లా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నాడు. ఆయన సాంప్రదాయ విద్యావ్యవస్థకు భిన్నంగా, విద్యార్థులకు నైపుణ్యాల ఆధారంగా ఉత్తమమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ స్కూల్ను ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయి ఉపాధ్యాయులు ఇక్కడ బోధన అందిస్తున్నారు.
టౌరియన్ వరల్డ్ స్కూల్లో విద్య ఖరీదైనదేనని చెప్పుకోవచ్చు. LKG నుండి 8వ తరగతి వరకు – వార్షిక ఫీజు రూ. 4.40 లక్షలు ఉండగా, 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు – వార్షిక ఫీజు రూ. 4.80 లక్షలుగా ఉంది. ఈ ఫీజులో యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, అదనపు సౌకర్యాల ఖర్చు కూడా చేర్చబడింది.
ధోని తన కూతురికి ఉత్తమ విద్య అందించేందుకు భారీగా ఖర్చు పెట్టారు. జీవా చదివే స్కూల్ సాంప్రదాయ విద్యావిధానానికి భిన్నంగా, విద్యార్థులను తరగతి గదికి పరిమితం చేయకుండా, వారి వ్యక్తిత్వ అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.
ధోని మైదానంలో ఎంత అద్భుతమైన వ్యూహాలను అమలు చేస్తాడో, తన కూతురు భవిష్యత్తు కోసం కూడా అంతే పట్టుదలతో విద్యాబ్యవస్థను ఎంపిక చేశాడు అని చెప్పుకోవచ్చు!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.