హిట్‌మ్యాన్ సెంచరీ.. నిలకడగా ఆడుతున్న భారత్!

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో.. భారత్ దూకుడైన ఆటతీరు కనబరుస్తోంది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో పాక్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు 85 బంతుల్లో తన సెంచరీను పూర్తి చేసుకున్నాడు. అటు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(57) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ(105), కెప్టెన్ విరాట్ కోహ్లీ(21) క్రీజ్‌లో ఉన్నారు. ఇక 33 ఓవర్లకు భారత్ ఒక వికెట్ నష్టానికి 191 పరుగులు […]

హిట్‌మ్యాన్ సెంచరీ.. నిలకడగా ఆడుతున్న భారత్!
Follow us

|

Updated on: Jun 16, 2019 | 5:14 PM

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో.. భారత్ దూకుడైన ఆటతీరు కనబరుస్తోంది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో పాక్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు 85 బంతుల్లో తన సెంచరీను పూర్తి చేసుకున్నాడు. అటు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(57) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ(105), కెప్టెన్ విరాట్ కోహ్లీ(21) క్రీజ్‌లో ఉన్నారు. ఇక 33 ఓవర్లకు భారత్ ఒక వికెట్ నష్టానికి 191 పరుగులు చేసింది.