Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs UAE: 10.5 ఓవర్లలో గ్రాండ్ విక్టరీ.. సెమీస్ చేరిన టీమిండియా

Emerging Asia Cup 2024: మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 107 పరుగులకే ఆలౌటైంది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 3 వికెట్లు కోల్పోయి సులభంగా గెలిచింది. ఈ విజయంతో గ్రూప్‌-బిలో అగ్రస్థానంలో నిలిచిన టీమ్‌ఇండియా సెమీఫైనల్‌లో చోటు ఖాయం చేసుకుంది.

IND vs UAE: 10.5 ఓవర్లలో గ్రాండ్ విక్టరీ.. సెమీస్ చేరిన టీమిండియా
Emerging Asia Cup 2024
Follow us
Venkata Chari

|

Updated on: Oct 22, 2024 | 8:25 AM

Emerging Asia Cup 2024: ఒమన్ వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ టీమ్ టీ20 ఆసియా కప్‌లో భాగంగా గత రాత్రి భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్లు తలపడ్డాయి. ఒమన్‌లోని అల్ అమరత్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు రెండో మ్యాచ్ కాగా, ఇప్పుడు ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 10.5 ఓవర్లలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 107 పరుగులకే ఆలౌటైంది. అయితే, ఈ లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 3 వికెట్లు కోల్పోయి సులభంగా గెలిచింది. ఈ విజయంతో గ్రూప్‌-బిలో అగ్రస్థానంలో నిలిచిన టీమ్‌ఇండియా సెమీఫైనల్‌లో చోటు ఖాయం చేసుకుంది. ఈ గ్రూప్‌లో టీమ్ ఇండియాతో పాటు పాకిస్థాన్, యూఏఈ, ఒమన్‌లు కూడా ఉండగా, తిలక్ వర్మ బృందం తమ చివరి మ్యాచ్‌లో ఒమన్‌తో లీగ్ దశలో ఆడనుంది. ఆ తర్వాత సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.

రసిఖ్ సలామ్ బీభత్సం..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 16.5 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది. జట్టు తరపున ఒంటరి పోరాటం చేసిన రాహుల్ చోప్రా అర్ధసెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ బాసిల్ హమీద్ కూడా 22 పరుగుల సహకారం అందించాడు. భారత్ తరపున అద్భుత ఫాస్ట్ బౌలర్ రసిఖ్ సలామ్ 2 ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రసిఖ్ సలామ్ తన తొలి ఓవర్‌లోనే ఈ మూడు వికెట్లు తీశాడు. అతడితో పాటు రమణదీప్ సింగ్ 2 వికెట్లు తీయగా, అన్షుల్ కాంబోజ్, వైభవ్ అరోరా, అభిషేక్ శర్మ, నెహాల్ వధేరా తలో వికెట్ తీశారు.

అభిషేక్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్..

ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే టీమిండియా 108 పరుగులు చేయాల్సి ఉంది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన టీమ్‌ఇండియా.. కేవలం 10.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. అభిషేక్ శర్మ కేవలం 24 బంతుల్లో 241.66 స్ట్రైక్ రేట్‌తో 58 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అదే సమయంలో, కెప్టెన్ తిలక్ వర్మ కూడా 18 బంతుల్లో 21 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..