IND vs ENG 5th Test: 13 ఏళ్ల కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ ఇదే: రవిచంద్రన్ అశ్విన్

Turning Point of Ravichandran Ashwin Career: భారత స్టార్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన కెరీర్‌లో భారీ విజయం దిశగా దూసుకుపోతున్నాడు. ఇంగ్లండ్‌తో ధర్మశాలలో మార్చి 7 నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌లో 5వ, చివరి టెస్ట్ మ్యాచ్ ద్వారా అశ్విన్ తన కెరీర్‌లో 100 టెస్టులను పూర్తి చేయనున్నాడు. అంతకుముందు, అతను తన కెరీర్‌ను మలుపు తిప్పిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

IND vs ENG 5th Test: 13 ఏళ్ల కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ ఇదే: రవిచంద్రన్ అశ్విన్
R Ashwin Records

Updated on: Mar 05, 2024 | 6:43 PM

Turning Point of Ravichandran Ashwin Career: భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో మలుపు తిరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో ధర్మశాలలో మార్చి 7 నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌లో 5వ, చివరి టెస్ట్ మ్యాచ్ ద్వారా అశ్విన్ తన కెరీర్‌లో 100 టెస్టులను పూర్తి చేయనున్నాడు. 2012లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ తన కెరీర్‌లో కీలక మలుపు తిరిగిందని, అదే తన తప్పులను సరిదిద్దుకోవడానికి దోహదపడిందని మంగళవారం తెలిపాడు. ఇంగ్లండ్ ఆ సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఇది 1984-85 తర్వాత భారత్‌లో ఆ జట్టుకు మొదటి సిరీస్ విజయం. ఇంగ్లండ్‌తో జరిగిన 4 టెస్టుల సిరీస్‌లో అశ్విన్ 14 వికెట్లు పడగొట్టాడు.

2012లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ను గుర్తు చేసుకున్న అశ్విన్..

తన 100వ టెస్టు మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో అశ్విన్ మాట్లాడుతూ, ‘ఇంగ్లండ్‌తో జరిగిన 2012 సిరీస్ నాకు టర్నింగ్ పాయింట్. నేను ఎక్కడ మెరుగుపడాలో అది నాకు చెప్పిందంటూ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇదో పెద్ద అవకాశం. గమ్యం కంటే ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. నా ప్రిపరేషన్‌లో ఎలాంటి మార్పు లేదు. టెస్ట్ మ్యాచ్ గెలవాలి. అశ్విన్ తన కెరీర్‌లో అత్యుత్తమ స్పెల్ గురించి కూడా మాట్లాడాడు. అతని కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన గురించి అడిగినప్పుడు, ‘2018-19లో బర్మింగ్‌హామ్‌లో నా టెస్ట్ కెరీర్‌లో అత్యుత్తమ స్పెల్‌ను సాధించాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల, అనిల్ కుంబ్లే తర్వాత 500 టెస్టు వికెట్లు పూర్తి చేసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. అశ్విన్ 2011లో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 14వ భారత క్రికెటర్‌గా అశ్విన్‌ నిలిచాడు. అంతకుముందు, ఛెతేశ్వర్ పుజారా గతేడాది ఢిల్లీలో భారత్ తరపున 100వ టెస్టు ఆడాడు. అశ్విన్ ఇప్పటివరకు 99 టెస్టు మ్యాచ్‌లు ఆడి 23.91 సగటుతో 507 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 500కి పైగా వికెట్లు తీసిన రెండో భారతీయుడిగా అశ్విన్ నిలిచాడు.

ధర్మశాలలో 5వ టెస్టుకు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్.

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

1వ టెస్టు: జనవరి 25-29, హైదరాబాద్ (ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయం)

2వ టెస్టు: 2-6 ఫిబ్రవరి, విశాఖపట్నం (106 పరుగుల తేడాతో భారత్ విజయం)

3వ టెస్టు: ఫిబ్రవరి 15-19, రాజ్‌కోట్ (434 పరుగులతో భారత్ విజయం)

4వ టెస్టు : 23-27 ఫిబ్రవరి, రాంచీ (భారత్ 5 వికెట్ల తేడాతో విజయం)

5వ టెస్ట్: మార్చి 7-11, ధర్మశాల

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us