
ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయా? ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదా? అయితే ఈ చిన్న పరిహారం మీ కోసమే. తులసి మొక్క మూలాల్లో ఒక వస్తువును ఉంచడం ద్వారా శని, రాహువుల ప్రతికూల ప్రభావం తగ్గుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ మతంలో తులసి మొక్కను దేవతగా పూజించే సంప్రదాయం ఉంది. లక్ష్మీదేవి నివాసం ఉండే తులసి మొక్క ఉన్న ఇళ్లలో సంపద, శ్రేయస్సు వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం. జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం తులసి మొక్కకు చేసే కొన్ని ప్రత్యేక పరిహారాలు జీవితంలో వచ్చే ఆర్థిక, కుటుంబ సమస్యలను పరిష్కరిస్తాయి.
రూపాయి నాణెం పరిహారం ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శిప్రా రాయ్ సూచన ప్రకారం.. తులసి మొక్క మూలాల వద్ద మట్టిలో ఒక రూపాయి నాణెంను పాతిపెట్టడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఇంటి నుంచి ప్రతికూల శక్తి తొలగిపోయి, సంపద నిలకడగా ఉంటుంది. ఈ పరిహారం శని మరియు రాహువుల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా, వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది.
కుటుంబ కలహాలకు చెక్ కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటే ఈ పరిహారం ఎంతో ప్రయోజనకరం. తులసిని సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. మట్టిలో నాణెం ఉంచడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య ఆనందాన్ని పెంచడమే కాకుండా, అకాల మరణాలను నివారిస్తుందని కూడా నమ్ముతారు.
ఎప్పుడు చేయాలి? ఈ పరిహారాన్ని గురువారం లేదా శుక్రవారం నాడు చేయడం శ్రేయస్కరం. ఉదయాన్నే స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. నాణెం పాతిపెట్టిన తర్వాత ప్రతిరోజూ క్రమం తప్పకుండా తులసి కోట వద్ద దీపం వెలిగించి పూజించడం వల్ల ఫలితం త్వరగా ఉంటుంది.
మొక్క సంరక్షణ ముఖ్యం తులసి కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఔషధ పరంగా కూడా ఎంతో గొప్పది. అధిక రక్తపోటు, మధుమేహం, జ్వరం వంటి వ్యాధులను నివారించడంలో ఇది సహాయపడుతుంది. అందుకే తులసి మొక్కను జాగ్రత్తగా కాపాడుకోవాలి. వేసవిలో ఎండ తగలకుండా, శీతాకాలంలో చల్లని గాలుల నుంచి రక్షించాలి. మట్టి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే నీరు పోయాలి. నేలలో వేప నూనె లేదా పసుపు కలపడం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు మరియు పండితుల అభిప్రాయాల ఆధారంగా ఇవ్వబడినవి. భక్తులు తమ నమ్మకాన్ని బట్టి వీటిని అనుసరించవచ్చు