Yadadri: చల్లంగ చూడు నర్సన్నా.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ప్రజా గాయకుడు గద్దర్

|

Dec 19, 2021 | 6:43 PM

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని ప్రజా గాయకుడు గద్దర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో తరించారు. తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని నరసింహ స్వామిని వేడుకున్నట్టు చెప్పారు గద్దర్..

Yadadri: చల్లంగ చూడు నర్సన్నా.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ప్రజా గాయకుడు గద్దర్
Praja Gayakudu Gaddar
Follow us on

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని ప్రజా గాయకుడు గద్దర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో తరించారు. తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని నరసింహ స్వామిని వేడుకున్నట్టు చెప్పారు గద్దర్. ప్రకృతే గొప్ప దైవమన్నారు గద్దర్. దాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యతగా చెప్పారాయన. అనంతరం పేదోళ్లను చల్లంగ చూడు నర్సన్నా అంటూ తనదైన శైలిలో పాటపాడి దేవుడికి తన విన్నపాలు వినిపించారు. గద్దర్ పడిన ఆ పాటకు అక్కడే ఉన్నవారంతా ముగ్దులయ్యారు.

ఇక ఇదే రోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి సేవలో ఎమ్మెల్సీ సురభివాణి పాల్గొన్నారు. అనంతరం యాదాద్రి దేవస్థానం.. తిరుమలకు ఏమాత్రం తీసిపోనివిధంగా రూపు దిద్దుకుంటోందన్నారు. యాదాద్రిలో అణువణువూ అద్భుతంగా ఉందన్నారు. నరసింహ స్వామి ఆలయాన్ని ఇంత అత్యద్భుతంగా తీర్చిదిద్దుతోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు ఎమ్మెల్సీ సురభివాణి.

ఇలాంటి, అద్భుత పుణ్యక్షేత్రం యాదాద్రిలో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన సంస్థ నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు సురభివాణి. ఎలాంటి లాభాపేక్ష లేకుండా యాత్రా స్థలాల్లో నిత్యాన్నదాన సత్రాలు ఏర్పాటు చేస్తోన్న నిర్వాహకులను అభినందించారు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి దీనిని మరింత వృద్ధిలోకి తీసుకోవాలని కోరారు సురభివాణి.

ఇవి కూడా చదవండి: AP Movie Tickets: ఆన్‌లైన్‌లో మూవీ టికెట్ల కోసం జీవో 142 జారీ.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..

Brown Rice Benefits: డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్ ఎందుకు తినాలో తెలుసా.. సరికొత్త పరిశోధనల్లో తేలింది ఇదే..

 

ఇవి కూడా చదవండి: AP Movie Tickets: ఆన్‌లైన్‌లో మూవీ టికెట్ల కోసం జీవో 142 జారీ.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..

Brown Rice Benefits: డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్ ఎందుకు తినాలో తెలుసా.. సరికొత్త పరిశోధనల్లో తేలింది ఇదే..