AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Statue of Equality: ముచ్చింతల్‌కు సీఎం కేసీఆర్.. ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంలో శ్రీలక్ష్మీనారాయణ యాగానికి హాజరు

12 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువులో రెండో రోజు ఉత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. రెండో రోజు ఉత్స‌వాల్లో భాగంగా శ్రీల‌క్ష్మీనారాయ‌ణ‌యాగం నిర్వ‌హించ‌నున్నారు.

Statue of Equality: ముచ్చింతల్‌కు సీఎం కేసీఆర్.. ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంలో శ్రీలక్ష్మీనారాయణ యాగానికి హాజరు
Kcr
Balaraju Goud
|

Updated on: Feb 03, 2022 | 7:40 PM

Share

Statue of Equality: హైదరాబాద్(Hyderabad) మహానగర శివార్లలోని శంషాబాద్ సమీపం ముచ్చింతల్‌(Muchintal)లో ఆధ్యాత్మిక చరిత్రపుటల్లో సువర్ణాక్షాలతో లిఖించబడే అధ్యాయం ఆరంభమైంది. సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల (SriRamanujacharya) సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అద్భుతకార్యక్రమం ఫిబ్రవరి 2 తేదిన ఆరంభమైన ఈ మహోత్సవం ఫిబ్రవరి 14 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 13 రోజులపాటు జరిగే సహస్రాబ్ది సమారోహంలో భాగంగా యాగశాలలో జరగాల్సిన 1035 కుండాలతో శ్రీ లక్ష్మీనారాయణ యాగ కార్యక్రమం జరుగుతోంది.

13 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువులో రెండో రోజు ఉత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. రెండో రోజు ఉత్స‌వాల్లో భాగంగా శ్రీల‌క్ష్మీనారాయ‌ణ‌యాగం నిర్వ‌హించ‌నున్నారు. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ముచ్చింతల్‌ సమతా క్షేత్రంలో మహోత్కృష్టమైన సహస్రకుండాత్మక శ్రీ లక్ష్మీనారాయణ యాగ మహాక్రతువుకు అంకురార్పణ జరిగింది.ఈ యాగంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల్గొన‌నున్నారు. యాగశాలలో అగ్నిహోత్రం ఆవిష్కరణ, 1035 కుండలాల్లో శ్రీ లక్ష్మీ నారాయణ హోమం జరుగుతుంది. ఈ హోమాన్ని ఐదు వేల మంది రుత్వికులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వాములు, భక్తులు, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ యాగం పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌ నుంచి శంషాబాద్‌కు బయలు దేరారు.

రామానుజాచార్య సమారోహంలో భాగంగా 12 రోజులపాటు నిర్వహంచనున్న మహా యజ్ఞం కోసం మొత్తంగా 1.5 లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వినియోగించనున్నారు. ఈ నెయ్యి మొత్తాన్ని రాజస్థాన్‌ రాష్ట్రం పాత్‌మెడాలోని పూర్తి స్వదేశీ ఆవులను తీసుకొచ్చి ముచ్చింతల్‌, తాండూరులలోని వ్యవసాయ క్షేత్రాల్లో పోషిస్తూ వాటి పాల నుంచి సంప్రదాయ పద్ధతుల్లో తయారుచేశారు. త్రిదండి చినజీయర్‌స్వామి మార్గనిర్దేశకత్వంలో దాదాపు 6 నెలల ముందునుంచే యజ్ఞం కోసం నెయ్యిని సిద్ధం చేయడం మొదలుపెట్టడం విశేషం. యజ్ఞ సమిధలను సైతం శాస్త్రబద్ధంగా తయారుచేశారు.

1

1

2

2

ధ్వజస్తంభంపై గరుత్మంతుడు పఠం ఆవిష్కరణ సహస్రాబ్ది లో రెండోరోజు యజ్ఞ ఆచార్యుల చే అగ్ని మథనం,అగ్ని ప్రతిష్ఠ జరిగింది. ప్రధాన యాగశాలలో జరిగే మహా కార్యక్రమం ని వీక్షించేందుకు ధ్వజస్తంభం పై గరుత్మంతుడు పఠాన్ని ఎగరవేశారు. దీని ద్వారా అందరూ దేవుళ్లను గరుత్మంతుడు పిలుస్తారు. 13రోజుల పాటు జరిగే 1035 కుండాల యజ్ఞం ఎలాంటి ఆటంకం కలగకుండా జరగాలని గరుడ పఠం ఆవిష్కరణ… గరుడ పఠం ఆవిష్కరణ తరవాత, గరుడ ముద్ద ప్రసాద వితరణ జరిగింది. సంతాన కోసం ఎదురుచూస్తున్న దంపతులకు గరుడ ముద్ద ప్రసాదం తీసుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని ప్రసిద్ధి.

3

3

సమారోహంలో పాల్గొనేందుకు అతిరథ మహారధులు ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోడీ ముచ్చింతల్ రానున్నారు. ఆ రోజున ప్రధాని 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఫిబ్రవరి 6న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేడుకల్లో పాల్గొననున్నారు.  6వ తేదీన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, 7వ తేదీన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఫిబ్రవరి 9న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహస్రాబ్ది కార్యక్రమాలకు హాజరుకానున్నారు. 11వ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, 12వ తేదీన ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఉత్సవాల్లో పాల్గొంటారు. ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమతామూర్తి బంగారు విగ్రహాన్ని అవిష్కరించనున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో సైతం ముచ్చింతల్ కు రానున్నారు. అయితే ఆయన ఏ రోజున వస్తారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. వీరితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతో పాటు పలువురు విదేశీ ప్రముఖులు సైతం సహస్రాబ్ది వేడుకల్లో పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. ముచ్చింతల్ లో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా 7వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కమాండ్‌ కంట్రోల్‌ రూం ద్వారా ప్రత్యేక నిఘా ఇదిలావుంటే, ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరు కానున్న నేపథ్యంలో ఎస్‌పీజీకి చెందిన ప్రత్యేక భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సమతామూర్తి విగ్రహ ప్రాంగణానికి ముందు పార్కింగ్‌ ఏరియాకు ఎదురుగా ఉన్న భవనంలో పోలీసుల కమాండ్‌ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి పోలీసుల భద్రత ఏర్పాట్లు, ఇతర సమాచారాలన్నింటికి కూడా కమాండ్‌ కంట్రోల్‌ రూం పనిచేయనుంది. ఎస్‌పీజీతో పాటు ఆక్టోపస్, ప్రత్యేక కమాండోలు భద్రత కోసం రంగంలోకి దిగారు. ఇప్పటికే సమతామూర్తి ప్రాంగణంతో పాటు యాగశాల పరిసరాల్లో వీరు నిరంతరం నిఘా కాస్తున్నారు.

ఉత్సవాలకు ప్రత్యేక అశ్వాలు సమతామూర్తి సహస్రాబ్ధి సమరోత్సాహ వేడుకల్లో భాగంగా దేవతా మూర్తుల రథోత్సవం వేళ ముందుగా నడిపించేందుకు ఏపీలోని కడప వ్యాసాశ్రమం నుంచి రెండు శ్వేత రంగు అశ్వాలను రప్పించారు. రంగ, గోధ అనే పేర్లుగల ఈ అశ్వాలను ఆశ్రమంలో దేవతామూర్తుల బయటికి తీసుకొచ్చే సమయంలో ముందుగా నడిపిస్తుంటారు. వీటితో పాటు చిన్న జీయర్‌ ఆశ్రమంలో ఉన్న మరో అశ్వం యతి కూడా ఉత్సవాల్లో పాల్గొననుంది. ఈ అశ్వాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు.

టీటీడీ ప్రత్యేక సేవలు ముచ్చింతల్‌లో జరుగుతున్న సహస్రాబ్ధి సమారోహంలో తిరుమల తిరుపతి దేవస్థానం తమ వంతు పాత్ర పోషిస్తోంది. ప్రాంగణంలో తిరుమల తిరుపతి ప్రాసస్త్యం, తిరుమల నాడు–నేడు వ్యత్యాసాలు తెలిపే పలు ఛాయా చిత్రాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. చిత్ర ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నారు. విభిన్న రకాల కార్యక్రమాల్లో సహకరించేందుకు తితిదే సిబ్బంది 35 మంది రెండు వారాల పాటు ఇక్కడే ఉండనున్నారు. వీరు కాక దాదాపు 500 మంది వేద పారాయణం చేసేవారు, మ్యూజిక్‌ కాలేజ్‌ నుంచి ఆర్టిస్టులు, హరికథ కళాకారులు, మంగళవాద్యాలు మోగించే కళాకారులు 15 మంది వచ్చారు. వీరి కార్యకలాపాలను తితిదే తెలంగాణ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పర్యవేక్షిస్తున్నారు.