AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Somvati Amavasya: అమావాస్య రోజున ఏం తినాలి? ఏం తినకూడదు? సోమవతి అమావాస్య నియమాలు తెలుసుకోండి!

Somvati Amavasya Significance: సోమవతి అమావాస్య హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన తిథిగా భావిస్తారు. ఈ రోజున మాంసాహారం, తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలని శాస్త్రాలు సూచిస్తాయి. పితృదేవతల అనుగ్రహం పొందేందుకు అమావాస్య రోజున ఏం తినాలి, ఏం తినకూడదు అనే విషయాలను తెలుసుకోండి.

Somvati Amavasya: అమావాస్య రోజున ఏం తినాలి? ఏం తినకూడదు? సోమవతి అమావాస్య నియమాలు తెలుసుకోండి!
Somvati Amavasya 2026
Rajashekher G
|

Updated on: Jun 14, 2026 | 9:31 PM

Share

Somvati Amavasya Food Rules: హిందూ ధర్మంలో ప్రతి అమావాస్యకు ప్రాధాన్యత ఉంది. ఇక, సోమవారం రోజున వచ్చే అమావాస్యను ‘సోమవతి అమావాస్య’గా పరిగణిస్తారు. హిందూ సంప్రదాయంలో ఈ తిథికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పవిత్ర స్నానం, దానధర్మాలు, పూజలు, మంత్రజపం, పితృతర్పణం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా పూర్వీకుల ఆశీర్వాదం పొందేందుకు భక్తులు ప్రత్యేకంగా ఈ రోజును ఆచరిస్తారు.

ఈ ఏడాది సోమవతి అమావాస్య జూన్ 15, సోమవారం నాడు వస్తోంది. పంచాంగం ప్రకారం అమావాస్య తిథి జూన్ 14 మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రారంభమై, జూన్ 15 ఉదయం 8:24 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయ తిథి ఆధారంగా జూన్ 15న సోమవతి అమావాస్యను ఆచరిస్తారు. పురాణాలు, ధార్మిక గ్రంథాల ప్రకారం ఈ రోజున కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు సూచిస్తారు.

మాంసాహారం ఎందుకు తినకూడదు?

సోమవతి అమావాస్య రోజున ‘మాంసాహారం, మద్యపానం, ఇతర తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి’ అని శాస్త్రాలు పేర్కొంటాయి. అమావాస్య తిథిని పితృదేవతలకు అంకితం చేసిన రోజుగా భావిస్తారు. అందువల్ల ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

ఇవి కూడా చదవండి

ధార్మిక విశ్వాసాల ప్రకారం, అమావాస్య నాడు మాంసాహారం లేదా తామసిక పదార్థాలు సేవించడం వల్ల పితృదేవతలు అసంతృప్తి చెందుతారని చెబుతారు. దీంతో ఇంట్లో సానుకూల శక్తి తగ్గి, కుటుంబంలో అనవసర సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి ఏర్పడే అవకాశాలు ఉంటాయని నమ్మకం.

ఏం చేయాలి?

ఈ పవిత్రమైన రోజున పండ్లు, పాలు, సాత్విక భోజనం తీసుకోవడం, పితృతర్పణం చేయడం, విష్ణు లేదా శివారాధన చేయడం, అవసరమైన వారికి దానం చేయడం ఎంతో శ్రేయస్కరంగా భావిస్తారు. ఇలా ఆచరించడం ద్వారా పితృదేవతల ఆశీర్వాదం లభించి కుటుంబంలో శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం. అయితే, ఇవన్నీ ధార్మిక విశ్వాసాలు, పురాణాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించిన సమాచారం.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us