Navaratri 2024: 750 ఏళ్ల నాటి సంప్రదాయం, చరిత్రగల ఈ ఆలయంలో అమ్మవారిని కర్రలతో పూజిస్తారు.. ఎందుకంటే

మధుర కృష్ణుడి జన్మ స్థానం. అయినా ఇక్కడ అనేక ఇతర ఆలయాలున్నాయి. వాటిల్లో ఒకటి దుర్గాదేవి ఆలయం. ఇది చాలా విశిష్టమైనది. మహాభారత కాలం నాటిది అని నమ్మకం. దీని పేరు నారీ సెమ్రీ దేవాలయం. ఇక్కడ అమ్మవారైన నారి సెమ్రీని 'నాగర్‌కోట్ వలీ దేవి' అని కూడా పిలుస్తారు. నవరాత్రుల సమయంలో ఈ ఆలయంలో విభిన్నమైన వైభవం కనిపిస్తుంది. ఈ ఆలయం గురించి 750 ఏళ్ల నాటి నమ్మకం నేటికీ కొనసాగుతోంది.

Navaratri 2024: 750 ఏళ్ల నాటి సంప్రదాయం, చరిత్రగల ఈ ఆలయంలో అమ్మవారిని కర్రలతో పూజిస్తారు.. ఎందుకంటే
Dasara Navaratri 2024
Follow us

|

Updated on: Oct 04, 2024 | 3:43 PM

శారదీయ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో దుర్గాదేవిని పూజిస్తారు. ఈ సమయంలో మాతృశక్తిని పూజించడం వలన మనిషి జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోతాయని విశ్వాసం. దేశవ్యాప్తంగా అనేక దుర్గాదేవి ఆలయాలు ఉన్నాయి. చాలా దేవాలయాల్లో పూజా విధానం కూడా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మధురలో కృష్ణ నగరంలోని నారీ సెమ్రి అనే దుర్గాదేవి ఆలయం ఉంది. ఇక్కడ పూజా విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ ప్రదేశంలో దసరా నవరాత్రి వేడుకల్లో డప్పులు వాయించరు. అందుకు బదులుగా కర్రలు వాయిస్తారు.

మధుర కృష్ణుడి జన్మ స్థానం. అయినా ఇక్కడ అనేక ఇతర ఆలయాలున్నాయి. వాటిల్లో ఒకటి దుర్గాదేవి ఆలయం. ఇది చాలా విశిష్టమైనది. మహాభారత కాలం నాటిది అని నమ్మకం. దీని పేరు నారీ సెమ్రీ దేవాలయం. ఇక్కడ అమ్మవారైన నారి సెమ్రీని ‘నాగర్‌కోట్ వలీ దేవి’ అని కూడా పిలుస్తారు. నవరాత్రుల సమయంలో ఈ ఆలయంలో విభిన్నమైన వైభవం కనిపిస్తుంది. ఈ ఆలయం గురించి 750 ఏళ్ల నాటి నమ్మకం నేటికీ కొనసాగుతోంది. ఈ నమ్మకం కారణంగా.. ఈ ఆలయంలో నవరాత్రులలో పూజ సమయంలో కర్రలతో ఆడతారు. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని మథుర నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛతా గ్రామంలో ఉంది.

ఈ ఆలయానికి సంబంధించిన నమ్మకం ఏమిటంటే?

ఇవి కూడా చదవండి

నవరాత్రుల చివరి రోజున ఈ ఆలయంలో కర్రలను కర్రలతో వాయిస్తే.. దుర్గాదేవి ప్రసన్నురాలై భక్తులపై అపారమైన అనుగ్రహం కురిపిస్తుందని చెబుతారు. ఇది గత 750 సంవత్సరాలుగా సాగుతున్న సంప్రదాయం. ఒకసారి ఈ ఆలయంలో ఉన్న విగ్రహం విషయంలో సిసోడియా, యధువంశీ ఠాకూర్‌ల మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో కర్రలతో చాలా పోరాటాలు జరిగాయి. చివరికి యధువంశీ ఠాకూర్లు గెలిచారు. అప్పటి నుండి ఇక్కడ పూజ సమయంలో ఆలయ గోడలు, నేల , గంటలపై కర్రలతో కర్రలను కొడతారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం ఏడాది పొడవునా వంకరగా ఉంటుందని చెబుతారు. అయితే అది రామ నవమి రోజున నేరుగా మారుతుంది. కనుక ఇక్కడ అమ్మవారిని పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

తొమ్మిది రోజుల తొమ్మిది దేవతలు

నవరాత్రులు 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ కాలంలో 9 మంది అమ్మవారి అవతారాలను పూజిస్తారు. మొదటి దేవత శైలపుత్రి, రెండవది బ్రహ్మచారిణి, మూడవది చంద్రఘంట, నాల్గవది కూష్మాండ, ఐదవది స్కంధమాత, ఆరవది కాత్యాయిని, ఏడవది కాళరాత్రి, ఎనిమిదవది మహాగౌరి, తొమ్మిదవది సిద్ధిదాత్రి. ఇవి దుర్గాదేవి తొమ్మిది రూపాలు. నవరాత్రుల 9 రోజులలో దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. ప్రతి రోజూ చేసే పూజకు దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి పూజ వెనుక పురాణ విశ్వాస కథ ఉంది. ఈ సమయంలో అమ్మవారి భక్తులు 9 రోజుల పాటు ఉపవాసం ఉంటారు. వివిధ ప్రదేశాలలో దుర్గాదేవి పందాలను ఏర్పాటు చేస్తారు. నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి