Puri Jagannath: ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జగన్నాథుని విగ్రహాలు ఎందుకు మారుస్తారో తెలుసా..

|

Jun 19, 2024 | 5:58 PM

చెక్కతో ఉండే  జగన్నాథుడు, బలభద్రుడు, సోదరి సుభద్ర విగ్రహాలను 12 సంవత్సరాలకు ఒకసారి మార్చే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇలా విగ్రహాలను మార్చే సంప్రదాయాన్ని 'నవకళేబర' అంటారు. నవకళేబర అంటే జగన్నాథుని ఆలయంలో ప్రతిష్టించిన పాత జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రుడు, సుదర్శన పాత విగ్రహాల స్థానంలో కొత్తవి ప్రతిష్టించడం. ఈ విగ్రహాలు చెక్కతో తయారు చేయబడతాయి.

Puri Jagannath: ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జగన్నాథుని విగ్రహాలు ఎందుకు మారుస్తారో తెలుసా..
Lord Jagannath Idol
Follow us on

పూరీలోని శ్రీ జగన్నాథ దేవాలయం.. ఇది భగవాన్ జగన్నాథుడికి అంటే శ్రీ కృష్ణుడికి అంకితం చేయబడిన ఆలయం. ఈ ఆలయం హిందువుల నాలుగు ధాములలో ఒకటి. ఈ ఆలయంలో, శ్రీకృష్ణుడుతో పాటు అతని అన్న బలభద్రుడు, సోదరి సుభద్ర దేవి విగ్రహాలు ఉన్నాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రధాన ఆలయాల్లోని విగ్రహాలను మార్చే సంప్రదాయం ఉంది. అయితే ఈ విగ్రహాన్ని మార్చే సంప్రదాయాన్ని శతాబ్దాలుగా ఎందుకు ఆచరిస్తారు.. ఈ విగ్రహాల తయారీలో ఏ చెక్కను ఉపయోగిస్తారు.. ఎన్నో రహస్యాలకు నెలవు పురీ జగన్నాథుడి గురించి తెలుసుకుందాం..

జగన్నాథ పూరీ రథయాత్ర

శ్రీ జగన్నాథ ఆలయ వార్షిక రథయాత్ర ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ యాత్ర ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండవ రోజున జరుగుతుంది. జగన్నాథుని రథ యాత్ర కోసం శ్రీ కృష్ణుడు, బలరాముడు, సుభద్ర దేవిలకు మూడు వేర్వేరు రథాలు నిర్మించబడతాయి. ఈ రథయాత్రలో ముందుగా అన్న బలరాముడు రథం కదులుతుండగా.. సోదరి సుభద్ర రథం మధ్యలో, జగన్నాథుని రథం చివరిగా వెనుక వైపు కదులుతూ సాగుతుంది. రథాలపై కూర్చున్న భగవంతుడు తన మేనత్త ఇంటి గుండిచా ఆలయానికి వెళ్తాడు.

ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలు ఎందుకు మారుస్తారంటే

జగన్నాథ ఆలయంలోని విగ్రహాలను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు. చెక్కతో ఉండే  జగన్నాథుడు, బలభద్రుడు, సోదరి సుభద్ర విగ్రహాలను 12 సంవత్సరాలకు ఒకసారి మార్చే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇలా విగ్రహాలను మార్చే సంప్రదాయాన్ని ‘నవకళేబర’ అంటారు. నవకళేబర అంటే జగన్నాథుని ఆలయంలో ప్రతిష్టించిన పాత జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రుడు, సుదర్శన పాత విగ్రహాల స్థానంలో కొత్తవి ప్రతిష్టించడం. ఈ విగ్రహాలు చెక్కతో తయారు చేయబడతాయి. అవి క్షీణిస్తాయనే భయం ఉంది. అందుకే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వాటిని మారుస్తారు.

ఇవి కూడా చదవండి

నవకళేబర సంప్రదాయం రహస్యం

విగ్రహాలను మార్చే సమయంలో నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. నగరం అంతా అంధకారం ఉంటుంది. విగ్రహాల భర్తీ ప్రక్రియను గోప్యంగా ఉంచేందుకు వీలుగా ఇలా చేస్తున్నారు. విగ్రహాలను మార్చే సమయంలో అక్కడ ఒక ప్రధాన పూజారి మాత్రమే ఉంటారు. అప్పుడు ఆ ప్రధాన పుజారీ కళ్లకు గంతలు కడతారు. విగ్రహాలను మార్చే ప్రక్రియ పూర్తిగా గోప్యంగా ఉండేలా ఇలా చేస్తారు.

ఈ చెక్కతో శిల్పాలను తయారు చేస్తారు

ఈ శిల్పాలను వేప చెక్కతో తయారు చేస్తారు. జగన్నాథ ఆలయ ప్రధాన అర్చకుడు ముందుగా కొత్త విగ్రహాలకు సరైన చెట్లను ఎంపిక చేస్తారు. చెట్లు వేప మాత్రమే ఉండాలి. ఆ వేప చెట్ల వయసు కనీసం 100 సంవత్సరాల వయస్సు ఉండాలి. అలాంటి చెట్లకు ఎలాంటి లోపం ఉండకూడదు. ఈ చెట్లను నరికి ఆలయానికి తీసుకువస్తారు. ఆ చెక్కను మూడు దేవతల ఆకారాలుగా తీర్చిదిద్దుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.