మకర సంక్రాంతి: గాలి పటాలకు శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏంటి?

మకర సంక్రాంతి పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలతోపాటు గాలి పటాలను ప్రత్యేకంగా ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఎగురవేయడం చాలా ఉత్సాహంగా జరుగుతుంది. ఈ సంప్రదాయం అన్ని భారతీయ నగరాల్లో విస్తరించి ఉంది. గాలిపటాలను ఎగురవేయడం రామాయణం, రామచరితమానస్ కాలం నుంచి, మొఘలుల సమయంలో కూడా కొనసాగింది.

మకర సంక్రాంతి: గాలి పటాలకు శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏంటి?
Sriramudu Kites

Updated on: Jan 12, 2026 | 6:58 PM

మకర సంక్రాంతి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద పండగ. అయితే, సంక్రాంతి పండగను వివిధ పేర్లతో దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఎంతో ఘనంగా జరుపుకుంటాయి. ఇక, పండగ సందర్భంగా గాలి పటాలు ఎగురవేయడం అనేది చాలా ప్రసిద్ధి. పిల్లల నుంచి పెద్దల వరకు రంగు రంగుల గాలి పటాలు ఎగురవేస్తూ ఆనందిస్తారు. అయితే, ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. గాలి పటాలను శ్రీరాముడు, అతని సోదరులు కూడా ఎగురవేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాలతోపాటు గాలి పటాలను ప్రత్యేకంగా ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఎగురవేయడం చాలా ఉత్సాహంగా జరుగుతుంది. ఈ సంప్రదాయం అన్ని భారతీయ నగరాల్లో విస్తరించి ఉంది. గాలిపటాలను ఎగురవేయడం రామాయణం, రామచరితమానస్ కాలం నుంచి, మొఘలుల సమయంతో కూడా కొనసాగింది.

గాలి పటాలు ఎగురవేసిన శ్రీరాముడు

తమిళ రామాయణం ప్రకారం మకర సంక్రాంతి రోజు మొదటగా గాలిపటాలు ఎగురవేసిన వారు శ్రీరాములు. వారి గాలిపటం అంత ఎత్తుకు ఎగిరిందంటే అది ఇంద్రలోకానికి చేరిందని చెబుతారు. ఇప్పటి నుంచి, ఈ రోజు గాలిపటాలు ఎగురవేయడం ఒక శ్రద్ధావహ సంప్రదాయం గా మారింది.

తులసీదాస్ రాసిన రామచరితమానస్‌లో కూడా బాలకాండ ఎపిసోడ్‌లో, శ్రీరాముడు తన సోదరులతో కలిసి గాలిపటం ఎగురవేసిన సంఘటన ప్రస్తావించబడింది.

గాలిపటాలు ఎగురవేయడం వల్ల శారీరక ప్రయోజనాలు

మకర సంక్రాంతితో చలి తగ్గడం మొదలవుతుంది. దీంతో గాలిపటాలను ఎగురవేయడం ద్వారా సూర్యకిరణాలు మన శరీరానికి అందుకుంటాయి. ఇది విటమిన్ డి కలిగించి, శరీరానికి శక్తి ఇస్తుంది. చర్మ సమస్యలు తగ్గి, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

గాలి పటాలకున్న మరో చరిత్ర

గాలిపటాలు 2,000 సంవత్సరాల చరిత్ర కలిగాయి. చైనాలో మొదట గాలిపటాలు సందేశాలను పంపడానికి ఉపయోగించబడ్డాయని చెబుతారు. చైనా యాత్రికులు ఫా-హియెన్, జువాన్జాంగ్ వీటిని భారతదేశానికి తీసుకువచ్చారు. ప్రారంభంలో యుద్ధభూముల్లో సందేశాల కోసం, తరువాత మొఘలులు ఢిల్లీలో గాలిపటాల పోటీలను నిర్వహించారు. క్రమంగా ఇది భారతీయ ఇళ్లలో ఒక వినోదపు ఆటగా మారింది.

Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది.