Liquor Swami Ji: తమ భవిష్యత్ తెలుసుకోవడానికి అక్కడ ఆశ్రమానికి వెళ్తే.. ఫుల్ బాటిల్ తాగాల్సిందే.. అప్పుడే స్వామిజీ జోస్యం చెబుతారు

|

Sep 04, 2021 | 11:12 AM

Liquor Swami ji: తమిళనాడు లో లిక్కర్ స్వామిజి ...మీ భవిష్యత్తు తెలుసుకోవాలా... ఐతే స్వామిజిని ప్రసన్నం చేసుకోవాలి. ప్రసాదాలతో కాదు ... ఫుల్ బాటిల్ మద్యం తాగితేనే స్వామిజి ప్రసన్నం..

Liquor Swami Ji: తమ భవిష్యత్ తెలుసుకోవడానికి అక్కడ ఆశ్రమానికి వెళ్తే.. ఫుల్ బాటిల్ తాగాల్సిందే.. అప్పుడే స్వామిజీ జోస్యం చెబుతారు
Liquor Swami Ji
Follow us on

Liquor Swami Ji: తమిళనాడు లో లిక్కర్ స్వామిజి …మీ భవిష్యత్తు తెలుసుకోవాలా… ఐతే స్వామిజిని ప్రసన్నం చేసుకోవాలి. ప్రసాదాలతో కాదు … ఫుల్ బాటిల్ మద్యం తాగితేనే స్వామిజి ప్రసన్నం అవుతారు …. రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారిన లిక్కర్ స్వామిజి గురించి వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు లోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్ సమీపం లోని నెమిలి గ్రామంలో ఉన్న స్వామిజి మణి . స్వామిజి పూర్వీకం ఆంధ్ర . ఈ స్వామిజీ  దగ్గరకి తమ భవిష్యత్తుని తెలుసుకోవడానికి వేలాదిగా భక్తులు, ప్రజలు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు . పూజారుల దగ్గరికి ,స్వామీజీల దగ్గరకి మహిళలు అధిక సంఖ్యలో వస్తుంటారు. కానీ ఈ మణి స్వామిజి దగ్గరకి పురుషులు ఎక్కువ శాతం లో వస్తారు . వారి భవిష్యత్తు ఏంటి, ఆదాయం పెంపు విషయం లో ఎటువంటి మార్పులు జరుగుతాయో తెలుసుకుంటారు.

పురుషులు అధికసంఖ్యలో ఈ స్వామిజి ని ఆశ్రయించడానికి కారణం ఒక్కటే..  తమిళనాడు లో కొన్ని చోట్ల స్వామిజి మద్యం సేవించి భవిష్యత్తు చెప్తారు కానీ ఈ మణి స్వామిజి స్పెషల్ ఏంటంటే ఎవరైతే తమ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారో వారు ఒక ఫుల్ బాటిల్ మద్యం తాగితేనే వారికీ స్వామిజి భవిష్యత్తు గురించి జోశ్యం చెప్తారు. ఈ లిక్కర్ స్వామిజి గురించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియడం తో స్వామిజి ఆశ్రయానికి క్యూ కట్టిన భక్తులు . ఇప్పుడు ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్వామిజీ న్యూస్  వైరల్ అయ్యింది.

Also Read: Neem Sticks: మనకు ఉచితంగా దొరికే వేపపుల్లలు.. అమెరికాలో ఆన్‌లైన్‌లో పెట్టిమరీ అమ్మకం.. ఒక్కటి ఎంత ధరో తెలిస్తే షాక్..

ఎండబెట్టిన ఉసిరిని రోజూ రెండు ముక్కలు తినడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో..