Kailash Mansarovar Yatra: శివయ్య నివాసం కైలాస మానససరోవర యాత్ర చేయడం వలన ఎలాంటి ప్రయోజనం పొందుతారంటే..

హిందువులు చేసే కైలాస మానస సరోవర యాత్ర కేవలం ఒక తీర్థయాత్ర మాత్రమే కాదు.. ఇది ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చగల, అతనిని పాపాల నుంచి విముక్తినిచ్చి.. మోక్ష మార్గంలో తీసుకెళ్లగల ఆధ్యాత్మిక యాత్ర. ఈ మానస సరోవర యాత్ర ప్రజలను అంతర్గతంగా ప్రశాంతంగా , స్వచ్ఛంగా మార్చగల ఆధ్యాత్మిక అనుభవానికి ఒక అవకాశం. ఈ రోజు ఈ కైలాస మానససరోవర యాత్ర చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం..

Kailash Mansarovar Yatra: శివయ్య నివాసం కైలాస మానససరోవర యాత్ర చేయడం వలన ఎలాంటి ప్రయోజనం పొందుతారంటే..
Kailash Mansarovar Yatra 2025
Image Credit source: social media

Updated on: Jun 21, 2025 | 8:04 AM

హిందూ మతంలో కైలాస మానస సరోవర యాత్ర అత్యంత పవిత్రమైన, జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక యాత్రల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ యాత్ర శారీరక సవాలు మాత్రమే కాదు, తీవ్రమైన ఆధ్యాత్మిక అనుభవం కూడా.. ఈ యాత్ర చేపట్టే వ్యక్తులు అనేక రకాల ఆధ్యాత్మిక, మానసిక ఫలాలను పొందుతారు. కైలాస పర్వతం శివుని నివాసం అని నమ్ముతారు. మానస సరోవర సరస్సులో స్నానం చేసిన వ్యక్తి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ ప్రయాణం ఆత్మను శుద్ధి చేస్తుంది. కొత్త జీవితాన్ని చూసే అవకాశం ఇస్తుంది.. తద్వారా అతను తనలో తాను స్వచ్ఛతను అనుభవించగలడు.

ఈ మానస సరోవర యాత్ర హిందువులకు మాత్రమే కాదు బౌద్ధమతం, జైన మతాలకు కూడా ప్రాముఖ్యత ఉంది. ఈ కైలాస మానస సరోవరం మోక్షాన్ని పొందే ప్రదేశంగా పరిగణించబడుతుంది. కైలాస పర్వతాన్ని ప్రదక్షిణ చేసి కైలాస మానస సరోవరంలో స్నానం చేయడం వల్ల ఆత్మ విముక్తి లభిస్తుంది. బౌద్ధ మత గురువులు ఈ ప్రదేశానికి రావడం ద్వారా మోక్షం పొందుతారని, జైన మతంలోని మొదటి తీర్థంకరుడు ఋషభదేవ్ ఇక్కడ మోక్షాన్ని పొందారని నమ్ముతారు.

మానస సరోవరానికి చేసే కష్టతరమైన ప్రయాణంలో యాత్రికులు తమ శారీరక , మానసిక పరిమితులను అధిగమిస్తారు. ఇది వారికి జ్ఞానోదయం, ఆధ్యాత్మిక మేల్కొలుపు ఇచ్చిన అనుభవాన్ని ఇస్తుంది. ఈ పవిత్ర స్థలంలో కాంతి తరంగాలు, ధ్వని తరంగాల సంగమం ఉంటుంది. ఇవి ‘ఓం’ ను ప్రతిధ్వనిస్తాయి.. ఇది లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మనశ్శాంతి , స్థిరత్వం
మానస సరోవరం బ్రహ్మచే సృష్టించబడిందని, మానసిక శాంతి, ప్రాణదాత శక్తికి మూలంగా చెప్పబడుతుందని నమ్ముతారు. సరస్సు స్పష్టమైన నీటిలో, కైలాస పర్వతంలోని ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేయడం వల్ల మనసుకు అపారమైన ప్రశాంతత లభిస్తుంది. ఈ ప్రయాణం దురాశ, అనుబంధం, అహంకారం, కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలను విడిచిపెట్టి.. తనలోని అసలు స్వభావంతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది.

శివుని అనుగ్రహం
కైలాస పర్వతాన్ని శివుని నివాసంగా భావిస్తారు. ఈ యాత్ర చేపట్టే శివ భక్తులు శివుని నుంచి ప్రత్యేక ఆశీస్సులు పొందుతారు. శివమయంగా ఎలా ఉండాలో తెలిసిన అదృష్టవంతులైన భక్తులకు మాత్రమే ఈ యాత్ర చేసే అవకాశం లభిస్తుందని నమ్ముతారు. ఈ ప్రయాణం చాలా కష్టం, ఎత్తైన ప్రదేశంలో జరుగుతుంది. ఇది ఒక వ్యక్తి శారీరక, మానసిక ఓర్పును పరీక్షిస్తుంది. ఈ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేయడం వల్ల వ్యక్తి శారీరక బలం, మానసిక దృఢత్వం పెరుగుతుంది.

పునర్జన్మ చక్రం నుంచి విముక్తి
కొన్ని నమ్మకాల ప్రకారం మానస సరోవరం సరస్సులో స్నానం చేసిన వ్యక్తి ‘రుద్రలోకం’ చేరుకుంటాడు. సరస్సు నీటిని త్రాగే వ్యక్తి స్వయంచాలకంగా శివుడు సృష్టించిన స్వర్గానికి వెళ్ళే హక్కును పొందుతాడు. అది అతన్ని పునర్జన్మ చక్రం నుంచి విముక్తి చేస్తుంది. ఈ ప్రయాణం జీవితంలోని అడ్డంకులు, ప్రతికూల శక్తులను తొలగించడంలో సహాయపడుతుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us