IRCTC: అయోధ్య, కాశీ, గయ, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. 5 రోజుల ఆధ్యాత్మిక టూర్! ప్యాకేజీ ధర ఎంతంటే..?

IRCTC Ayodhya Kashi Gaya Tour Package Telugu: అయోధ్య, కాశీ, గయ, ప్రయాగ్‌రాజ్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించుకోవాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. బెంగళూరు నుంచి విమాన ప్రయాణంతో 5 రోజుల ఈ ఆధ్యాత్మిక టూర్‌కు ఒక్కొక్కరికి రూ.32,500 నుంచి ప్యాకేజీ ధరలు ప్రారంభమవుతున్నాయి.

IRCTC: అయోధ్య, కాశీ, గయ, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. 5 రోజుల ఆధ్యాత్మిక టూర్! ప్యాకేజీ ధర ఎంతంటే..?
Irctc Ayodhya Kashi Gaya Tour

Updated on: Sep 11, 2026 | 4:20 PM

IRCTC Ayodhya Kashi Gaya Tour Package Telugu: ఆధ్యాత్మిక క్షేత్రాలను ఒకేసారి దర్శించుకోవాలనుకునే భక్తులకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. అయోధ్య, కాశీ, ప్రయాగ్‌రాజ్, గయ, బోధ్‌గయ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను కవర్ చేసే ఈ యాత్రను బెంగళూరు నుంచి విమాన ప్రయాణం ద్వారా నిర్వహిస్తున్నారు. ‘హోలీ అయోధ్య విత్ గయ, కాశీ & ప్రయాగ్‌రాజ్ ఎక్స్ బెంగళూరు’ పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ టూర్ మొత్తం 4 రాత్రులు/5 రోజులు ఉంటుంది.

2026 సెప్టెంబర్ 30న బెంగళూరు నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటలకు బెంగళూరు నుంచి లక్నోకు విమానం బయలుదేరి మధ్యాహ్నం 1.25 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి అయోధ్యకు వెళ్లి హోటల్‌లో బస చేస్తారు.

అయోధ్య నుంచి ప్రయాగ్‌రాజ్, కాశీ

రెండో రోజు ఉదయం అయోధ్యలోని రామ మందిరం, హనుమాన్ గఢీ దర్శనం ఉంటుంది. అనంతరం ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరి త్రివేణి సంగమం, పాతాళపురి ఆలయాన్ని దర్శిస్తారు. ఆ తర్వాత వారణాసికి చేరుకుని రాత్రి బస చేస్తారు.

ఇవి కూడా చదవండి

మూడో రోజు తెల్లవారుజామున కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి ఆలయం, అన్నపూర్ణ ఆలయం దర్శనం ఉంటుంది. సాయంత్రం పవిత్ర గంగా నదీ తీరంలో జరిగే గంగా హారతిని వీక్షించే అవకాశం ఉంటుంది.

బోధ్‌గయ, గయ దర్శనం

నాలుగో రోజు అల్పాహారం తర్వాత బోధ్‌గయకు ప్రయాణం ఉంటుంది. అక్కడ బౌద్ధులకు అత్యంత పవిత్రమైన మహాబోధి ఆలయం దర్శనం ఉంటుంది. అనంతరం హోటల్‌లో బస చేస్తారు.

ఐదో రోజు ఉదయం గయలోని ప్రసిద్ధ విష్ణుపాద ఆలయం దర్శించుకుని, అనంతరం పాట్నా విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 11.25 గంటలకు పాట్నా నుంచి బెంగళూరుకు విమానం బయలుదేరి అక్టోబర్ 5న తెల్లవారుజామున 2 గంటలకు బెంగళూరు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు

ఒక్కొక్కరికి సింగిల్ ఆక్యుపెన్సీ రూ.43,200, డబుల్ ఆక్యుపెన్సీ రూ.34,600, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.32,500గా ఉంది. 5–11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ.32,300, బెడ్ లేకుండా రూ.30,200, 2–4 ఏళ్ల పిల్లలకు రూ.19,000గా ధర నిర్ణయించారు.

ఈ ప్యాకేజీలో ఎకానమీ క్లాస్ విమాన టికెట్లు, నాలుగు రాత్రుల హోటల్ వసతి, అల్పాహారం, రాత్రి భోజనం, ఏసీ వాహనంలో స్థానిక ప్రయాణాలు, దర్శన ఏర్పాట్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, జీఎస్టీ తదితరాలు ఉన్నాయి. అయితే ఆలయ ప్రవేశ రుసుములు, బోటింగ్, వ్యక్తిగత ఖర్చులు, గైడ్ సేవలు వంటి వాటికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

మొత్తం 29 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నందున, ఈ ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేసుకునే వారు ప్యాకేజీ నిబంధనలు, విమాన సమయాలు, హోటల్ లభ్యత, ఛార్జీలను బుకింగ్‌కు ముందు ఐఆర్‌సీటీసీ వద్ద తప్పనిసరిగా నిర్ధారించుకోవడం మంచిది.

ఐఆర్‌సీటీసీ ‘హోలీ అయోధ్య విత్ గయ, కాశీ & ప్రయాగ్‌రాజ్ ఎక్స్ బెంగళూరు’ టూర్ ప్యాకేజీ బుకింగ్, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us