AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman: వానరరూపంలో ఉన్న హనుమంతుడికి ఒంటె వాహనం.. పురాణాల్లో ఆసక్తికరమైన కథనం ఏమిటంటే..

కొన్ని యోజనాల దూరాన్ని ఒక్క అంగలో అధిగమించే రుద్రాంశ సంభూతుడు.. వాయు పుత్రుడు వాహనం ఒంటె.  ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వామివారి విగ్రహం ఎదురుగా ఒంటి విగ్రహం ఉంటుంది. వానర రూపంలో ఉన్న ఆంజనేయునికి ఒంటె వాహనం అవ్వడం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి పురాణాల్లో ఉంది. 

Hanuman: వానరరూపంలో ఉన్న హనుమంతుడికి ఒంటె వాహనం.. పురాణాల్లో ఆసక్తికరమైన కథనం ఏమిటంటే..
Lord Hanuman
Surya Kala
|

Updated on: May 17, 2022 | 8:22 AM

Share

Hanuman: రామభక్త హనుమంతుడిని హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో కొలుస్తారు. హిందువులు ఎలా ఉండాలో ధర్మాన్ని ఎలా రక్షించాలి అని హిందూ ధర్మానికి(Hindu Dharma) ప్రతీక హనుమంతుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి పేర్లతో ఆంజనేయస్వామిని ఆరాధిస్తారు. దేశంలో హనుమంతుడి గుడి, లేదా విగ్రహం లేని ఊరు బహుఅరుదని చెప్పవచ్చు. అయితే శ్రీరామ బంటు హనుమంతుడి జీవితం గురించి మన పురాణాల్లో అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా అనేక గాథలున్నాయి.  కొన్ని యోజనాల దూరాన్ని ఒక్క అంగలో అధిగమించే రుద్రాంశ సంభూతుడు.. వాయు పుత్రుడు వాహనం ఒంటె.  ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వామివారి విగ్రహం ఎదురుగా ఒంటి విగ్రహం ఉంటుంది. వానర రూపంలో ఉన్న ఆంజనేయునికి ఒంటె వాహనం అవ్వడం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి పురాణాల్లో ఉంది.

రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి వదిస్తాడు. అతడి మృతదేహాన్ని ఋష్యమూక పర్వతం (నేటి హింపీ ప్రాంతం) పై పడేశాడు. ఈ సంఘటనే వాలి శాపాన్ని పొందేందుకు కారణంగా మారింది. ఋష్యమూక పర్వతం పైన మాతంగ మహాముని తపస్సు చేసుకుంటున్నాడు.  తాను తపస్సు చేసుకుంటున్న పర్వతంపై వాలి దుందుభి మృతదేశాన్ని  పడవేయడం మాతంగ మహర్షి చూశాడు. దీంతో మాతంగ మహర్షి కోపంతో వాలి కనుక రుష్యమూక పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపించాడు.

కాలక్రమంలో సుగ్రీవుణ్ణిని వాలి చంపడానికి వెంటాడిన సమయంలో.. తన అన్న ఋష్యమూక పర్వతం మీద కాలు పెట్టడని శాపోదంతం తెలుసున్న సుగ్రీవుడు పర్వతానికి వెళ్లి దాక్కున్నాడు. ఆ సమయంలో తన స్నేహితుడైన సుగ్రీవుణ్ణి చూడటానికి హనుమంతుడు ఋష్యమూక పర్వతం మీదకు చేరుకున్నాడు. అప్పుడు అక్కడే ఉన్న పంప సరోవరాన్ని తిలకించాలని హనుమంతుడు అనుకుంటాడు. దీంతో మిత్రుడైన హనుమంతుడు పంపా సరోవరం తీరంలో తిరగడానికి అనువుగా సుగ్రీవుడు ఒంటెను సిద్ధం చేశాడు. అప్పుడు హనుమంతుడు ఒంటెను అధిరోహించి.. విహరించినట్లు.. అప్పటి నుంచి హనుమంతుడికి ఒంటె వాహనంగా మారినట్లు కథనం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..