AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Puranam: మీరు చేసే ప్రతి తప్పుకూ చిత్రగుప్తుడి దగ్గర లెక్క.. ఏ పాపానికి ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా?

మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఆత్మ ప్రయాణం ఎటు సాగుతుంది? మనం చేసే పాపపుణ్యాలకు సాక్ష్యం ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే 'గరుడ పురాణం'. విష్ణుమూర్తి తన వాహనమైన గరుత్మంతుడికి ఉపదేశించిన ఈ పురాణం, మనిషి బతికున్నప్పుడు చేసే తప్పులకు యమలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. ముఖ్యంగా గరుడ పురాణంలో పేర్కొన్న 28 నరకాల్లో అత్యంత భయంకరమైన 10 నరకాలు, వాటిలో విధించే దిగ్భ్రాంతికరమైన శిక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Garuda Puranam: మీరు చేసే ప్రతి తప్పుకూ చిత్రగుప్తుడి దగ్గర లెక్క.. ఏ పాపానికి ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా?
Garuda Puranam Hell Punishments List
Bhavani
|

Updated on: Apr 08, 2026 | 8:00 PM

Share

చాలామంది గరుడ పురాణం అంటే కేవలం మరణించినప్పుడే చదవాలని, ఇంట్లో ఉంచుకోకూడదని భయపడతారు. కానీ ఇది ఒక విజ్ఞాన సర్వస్వం. ఇందులో జ్యోతిష్యం, వైద్యం, వాస్తు శాస్త్రం, యోగా మరియు నీతి సూత్రాలు ఉన్నాయి. మనిషిని సన్మార్గంలో నడిపించడానికి, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి ఇది ఒక గొప్ప మార్గదర్శి.

నరక లోక విశ్లేషణ: ఏ పాపానికి.. ఏ శిక్ష? యమలోకంలో చిత్రగుప్తుడు రాసే పాపపుణ్యాల లెక్క ఆధారంగా యమధర్మరాజు ఆత్మలకు శిక్షలు విధిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ కింది నరకాలు అత్యంత భయంకరమైనవి:

తామిస్ర నరకం: ఇతరుల ఆస్తిని, ధనాన్ని లేదా ఎదుటివారి భార్యపిల్లలను అపహరించేవారు ఇక్కడికి చేరుతారు. యమదూతలు వారిని కటిక చీకటిలో బంధించి దారుణంగా కొడతారు.

అంధతామిస్రం: నమ్మకద్రోహం చేసేవారు, స్నేహితుల భార్యలతో వ్యభిచరించే వారు ఇక్కడ శిక్షించబడతారు. అంధత్వం వచ్చేంత భయంకరమైన వేదనను ఆత్మ ఇక్కడ అనుభవిస్తుంది.

అగ్నిమయ నరకం: అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇతరులను మోసం చేసేవారిని ఇక్కడికి పంపిస్తారు. విష సర్పాలు, కీటకాలు వారిని నిరంతరం కాటు వేస్తూ హింసిస్తాయి.

కుంభీపాక నరకం: నోరులేని మూగజీవాలను చంపి, వండి తినేవారికి ఇక్కడ శిక్ష పడుతుంది. మరుగుతున్న నూనె ఉన్న పెద్ద పాత్రలో ఆత్మను వేసి ఉడికిస్తారు.

శాల్మలీ నరకం: అనైతిక సంబంధాలు పెట్టుకునే వారిని ముళ్ళతో నిండిన చెట్టుకు కట్టివేసి భయంకరంగా హింసిస్తారు.

అసిపత్రవన నరకం: ధర్మాన్ని విడిచిపెట్టి, కన్నతల్లిదండ్రులను, గురువులను గౌరవించని వారు ఇక్కడ కత్తులతో నరకబడతారు.

సత్కర్మలు చేయండి.. మోక్షాన్ని పొందండి” అనేదే గరుడ పురాణం ఇచ్చే ప్రధాన సందేశం. మనం చేసే ప్రతి పనికీ ప్రతిఫలం ఉంటుందని గుర్తించి, దయ, సత్యం, ధర్మం అనే మార్గాల్లో పయనించడమే ఆ మాధవుడికి ఇచ్చే నిజమైన నివాళి.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. పురాణాల్లోని విషయాలు ఆధ్యాత్మిక విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. ధర్మబద్ధమైన సందేహాల కోసం పండితులను సంప్రదించడం ఉత్తమం.

Follow Us