Garuda Puranam: యమలోకంలో 4 ద్వారాలు.. పాపాత్మలు ఏ ద్వారం గుండా వెళతాయో తెలుసా?
మరణించిన తర్వాత యమలోకానికి వెళ్లే సమయంలో ఆత్మ వివిధ ప్రదేశాల గుండా ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో ఆత్మ తన చెడు కర్మల ప్రకారం శిక్షను అనుభవిస్తుంది. గరుడ పురాణం యమలోకానికి చెందిన నాలుగు ద్వారాలను వివరిస్తుంది. అలాగే, పాపాత్ములు ఎలాంటి ద్వారాలు ద్వారా ప్రవేశించగలుగుతాయో కూడా వివరించబడింది. ఈ విషయాలు తెలుసుకుందాం.

హిందూ మత గ్రంథాలలో గరుడ పురాణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది 18 గొప్ప పురాణాలలో ఒకటి. జీవితం, మరణం, ఆత్మ ప్రయాణం లాంటి విషయాలను స్పష్టంగా వివరించింది. పుట్టిన వారికి మరణం తప్పదు. మరణం తర్వాత వారి ఆత్మ ఈ లోకం నుంచి వెళ్లిపోతుంది. తన తదుపరి ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. పురాణాల ప్రకారం పాపాలు చేసినవారైతే నేరుగా యమలోకానికి వెళతారు.
యమలోకానికి వెళ్లే సమయంలో ఆత్మ వివిధ ప్రదేశాల గుండా వెళుతుంది. ఈ ప్రయాణంలో ఆత్మ తన చెడు కర్మల ప్రకారం శిక్షను అనుభవిస్తుంది. అయితే, యమ లోకానికి వెళ్లే మార్గంలో మాత్రమే కాకుండా.. అక్కడికి చేరుకున్న తర్వాత కూడా ఆత్మకు దాని కర్మల ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. గరుడ పురాణం యమలోకానికి చెందిన నాలుగు ద్వారాలను గురించి వివరిస్తుంది. పాపాత్ములు ప్రవేశించడానికి ఏ ద్వారాలు అనుమతిస్తాయో కూడా వివరించింది. ఆ విషయాల గురించి తెలుసుకుందాం.
యమలోకానికి నాలుగు ప్రధాన ద్వారాలు
యమలోక తూర్పు ద్వారం:
గరుడ పురాణంలో చెప్పినట్లుగా.. యమలోక తూర్పు ద్వారం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది వజ్రాలు, ముత్యాలు, నీలమణి, పుష్పరాగముతో అలంకరించబడి ఉంటుంది. కొంతమంది దీన్ని స్వర్గ ద్వారంగా పిలుస్తారు. మరణానంతరం, యోగులు, ఋషులు, సిద్ధులు, జ్ఞానోదయం పొందిన జీవుల ఆత్మలు ఈ ద్వారం గుండా ప్రవేశిస్తాయి. ద్వారం లోపలకి వెళ్లిన తర్వాత, ఆత్మలను గంధర్వులు, దేవతలు, అప్సరసలు స్వాగతిస్తారు.
యమలోక పశ్చిమ ద్వారం:
యమలోకం పశ్చిమ ద్వారం కూడా రత్నాలతో పొదిగి ఉంటుంది. ఈ ద్వారం ద్వారా జీవితంలో దానధర్మాలు, మతపరమైన ఆచారాలు వంటి మంచి పనులు చేసిన వారి ఆత్మలు ప్రవేశిస్తాయి.
యమలోక ఉత్తరద్వారం:
ఈ ద్వారం కూడా వివిధ బంగారు పూత పూసిన రత్నాలతో పొదిగి ఉంటుంది. యమలోక ఉత్తర ద్వారం తల్లిదండ్రులకు సేవ చేసిన, ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడిన, అహింసా చర్యలను ఆచరించిన, పేదలకు సహాయం చేసిన, ధర్మ మార్గాన్ని అనుసరించిన వారి ఆత్మలను అనుమతిస్తుంది.
యమలోక దక్షిణ ద్వారం:
యమలోక దక్షిణ ద్వారం అత్యంత భయంకరమైనదిగా పరిగణిస్తారు. పాపాత్ములు ప్రవేశించే ద్వారం ఇదే. జీవితంలో మతపరమైన నియమాలు, నిబంధనలను ధిక్కరించి అన్యాయం చేసే వారి ఆత్మలు ఈ ద్వారం గుండా వెళ్లాల్సిందే. దీన్నే నరక ద్వారం అని కూడా పిలుస్తారు. ఇక, ఈ ద్వారంలోకి ప్రవేశించిన తర్వాత.. ఆత్మలు 100 సంవత్సరాలు బాధించబడతాయి.
Note: ఈ వార్తలోని సమాచారం మతపరమైన విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. TV9తెలుగు దీనిని ధృవీకరించదు.
