Garuda Puran: పీరియడ్స్ సమయంలో స్త్రీలు పూజ, ఉపవాసం నిషేధం.. గరుడపురాణం ఏమి చెప్పిందంటే..

గరుడ పురాణాన్ని శ్రీమహావిష్ణువు గరుత్మంతుడికి ఉపదేశించాడు. దీనికి విష్ణువు అధినేత. ఇందులో మత విశ్వాసాల గురించి, జీవి జనన, మరణ చక్రం గురించి, ఆత్మ ప్రయాణం .. పాప పుణ్య కర్మల ఫలితాలను విశదంగా వివరించబడింది. ముఖ్యంగా మనుషులు జీవిమ్చినప్పుడు చేసే పనులు.. మరణించిన తర్వాత ఏ విధంగా ఫలితాలను ఇస్తుందో తెలిపారు. అంతేకాదు గరుడ పురాణం సమతుల్య శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గురించి కూడా ముఖ్యమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.

Garuda Puran: పీరియడ్స్ సమయంలో స్త్రీలు పూజ, ఉపవాసం నిషేధం.. గరుడపురాణం ఏమి చెప్పిందంటే..
Garuda Puran

Updated on: Aug 25, 2025 | 12:47 PM

గరుడ పురాణం హిందూ మతంలో ప్రధాన గ్రంథం. దీనిలో మతపరమైన, ఆధ్యాత్మిక అంశాలు మాత్రమే కాదు శరీరక, మానసిక ఆరోగ్యం గురించి ముఖ్యమైన సూచనలు కూడా ఇవ్వబడ్డాయి. ఈ గ్రంథం జీవితంలోని ప్రతి అంశంపై దృష్టి పెట్టింది. మనిషి శారీరక, మానసిక , ఆధ్యాత్మిక శ్రేయస్సుకు మార్గనిర్దేశం చేసింది. అందులో మహిళల ఋతుచక్రానికి సంబంధించిన అనేక విషయాలు కూడా ఈ పురాణంలో చెప్పబడ్డాయి. ఇవి మహిళల శారీరక, మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

గరుడ పురాణం ప్రకారం ఋతుస్రావం అనేది స్త్రీలకు సహజమైన , అవసరమైన శారీరక ప్రక్రియగా పరిగణించబడుతుంది. ఇది మహిళల జీవిత చక్రంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో మహిళలకు శారీరక, మానసిక విశ్రాంతి అవసరం. గరుడ పురాణం ప్రకారం మహిళలు తమ శారీరక అలసటను, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. ఇది శరీరాన్ని తిరిగి శక్తివంతం చేసుకునే సమయం కనుక ఈ సమయంలో స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొంది.

ఈ కాలంలో మహిళలు ఎక్కువ పనిలో చేయకూడదని గరుడ పురాణం కూడా చెబుతోంది. దీనికి కారణం ఋతుస్రావం సమయంలో శరీరం, మనస్సు రెండింటిపై అదనపు ఒత్తిడి ఉంటుంది. కనుక ఈ సమయంలో విశ్రాంతి తీసుకుంటూ.. పనికి, పూజలు వంటి వాటికీ దూరంగా ఉండాలని నియమం పెట్టి ఉంటారు. ఈ సమయంలో మహిళలు స్వచ్ఛతను కాపాడుకోవాలని సూచించారు. తద్వారా శారీరక, మానసిక సమతుల్యతను కాపాడుకోవచ్చు. స్వచ్ఛతతో పాటు, మానసిక శాంతి కూడా ముఖ్యం.. తద్వారా ఎలాంటి ఒత్తిడి ఉండదు. శరీర శక్తి సరైన దిశలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ కాలంలో స్త్రీలు శారీరకంగా, మానసికంగా తమని తాము సరిగ్గా పునరుద్ధరించుకోగలిగేలా కొంతవరకు కుటుంబం, సమాజం నుంచి దూరంగా ఉంచాలని గరుడ పురాణం కూడా పేర్కొంది. అయితే ఈ సలహా సామాజిక ఒంటరితనం కోసం కాదు.. ఈ సమయంలో స్త్రీలు తీసుకోవాల్సిన విశ్రాంతి, మానసిక శాంతి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నియమం పెట్టబడింది.

ఈ సమయంలో మహిళలు పూజలు చేసి ఉపవాసం ఉంటే.. అది వారి శారీరక, మానసిక స్థితిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఈ పురాణంలో ప్రస్తావించబడింది. పీరియడ్స్ ను ఒక బాధ్యతగా లేదా లోపంగా చూడకూడదు. దానిని సహజ ప్రక్రియగా అంగీకరించాలి.. తద్వారా మహిళలు ఆ సమయంలో గౌరవంగా, సుఖంగా ఉంటారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.