
చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. బద్రీనాథ్ ధామ్ తలుపులు (మే 4న) ఈ రోజున తెరుచుకున్నాయి. ఇప్పటికే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ధామ్ తలుపులు తెరవబడ్డాయి. బద్రీనాథ్ ప్రయాణం కూడా త్వరలో ప్రారంభం కానుంది. చార్ ధామ్ యాత్ర హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. నాలుగు ధామాలలో ఒకటైన బద్రీనాథ్ ధామ్ ఇల వైకుంఠం అని కూడా పిలుస్తారు. అయితే ఈ రోజు బద్రీనాథ్ ధామ్ను భూమి వైకుంఠం అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
నాలుగు ధామాలలో బద్రీనాథ్ ధామానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని భావిస్తారు. అందుకే దీనిని ఇల వైకుంఠ ధామం అని కూడా పిలుస్తారు. కారణం శ్రీ మహా విష్ణువు బద్రీనాథ్ ధామ్లో నివసిస్తున్నాడని నమ్మకం. అందుకే దీనికి హిందూ మతంలో ప్రధాన హోదా ఇవ్వబడింది. ఎవరైనా సరే తమ జీవితంలో ఒక్కసారైనా బద్రీనాథ్ను సందర్శిస్తే.. అతను జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడని విశ్వాసం ఉంది. అందుకే దీనిని దివ్య ప్రపంచం అని కూడా అంటారు.
బద్రీనారాయణుడు అని పిలువబడే శ్రీ మహా విష్ణువును బద్రీనాథ్ ధామ్లో పూజిస్తారు. ఇక్కడ మహా విష్ణువు స్వయంభువుగా వెలసిన ఒక మీటరు ఎత్తున్న నల్లరాతి విగ్రహం ఇక్కడ ప్రతిష్టించబడింది. దీనిని ఆది శంకరాచార్యులు నారద కుండం నుంచి బయటకు తీసిన తర్వాత స్థాపించారు. ఈ విగ్రహం కుడి వైపున కుబేర దేవుడు, లక్ష్మీ దేవి, నారాయణ విగ్రహాలు కూడా ప్రతిష్టించబడ్డాయి. ఈ విగ్రహం విష్ణువు ఎనిమిది స్వయంభువైన విగ్రహాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.