Diwali 2021 – Ayodhya: రామ జన్మస్థలంలో సరికొత్త రికార్డ్.. కోట్లాది భక్తులు పరవశించిపోయిన అద్భుత దృశ్యం..!

|

Nov 04, 2021 | 7:39 PM

Ayodhya Deepotsav 2021: రామ జన్మస్థలం అయోధ్యలో అద్భుత దృశ్యం సాక్షాత్కరించింది. ఆ అపురూపమైన దృశ్యాన్ని చూసి కోట్లాదిమంది భక్తులు పరవశించిపోయారు.

Diwali 2021 - Ayodhya: రామ జన్మస్థలంలో సరికొత్త రికార్డ్.. కోట్లాది భక్తులు పరవశించిపోయిన అద్భుత దృశ్యం..!
Ayodhya Deepotsav 2021
Follow us on

Ayodhya Deepotsav 2021: రామ జన్మస్థలం అయోధ్యలో అద్భుత దృశ్యం సాక్షాత్కరించింది. ఆ అపురూపమైన దృశ్యాన్ని చూసి కోట్లాదిమంది భక్తులు పరవశించిపోయారు. అంతేకాదు.. మునుపెన్నడూ లేనివిధంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఏకంగా గిన్నీ్స్ రికార్డులో చోటు దక్కించుకుంది. అయోధ్య నగరి లక్షల దివ్వెలతో వెలిగిపోయింది. సరయు నది తీరం లక్షల దీపాల వెలుగులో మరింత అందంగా దర్శనమిచ్చింది. ఒకటి కాదు రెండు కాదు అక్షరాల 12 లక్షల దీపాల వెలుగులో అయోధ్య ఆధ్యాత్మికతను సంతరించుకుంది. దీపావళి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన దీపోత్సవం ఏకంగా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. 12 లక్షల దీపాలు వెలిగించడంతో అయోధ్యలో కొత్త రికార్డ్‌ నమోదైంది. 12 లక్షల దీపాలతో పాటు అయోధ్యలో ఏర్పాటు చేసిన లేజర్‌షో కూడా భక్తులను అమితంగా ఆకట్టుకుంది. స్థానికులతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అయోధ్యకు వచ్చిన భక్తులు కూడా ఈ అద్భుత దృశ్యాన్ని చూసి పరవశించిపోయారు.

దీపావళి సందర్భంగా అయోధ్య నగరిని కూడా అందంగా అలంకరించారు అక్కడి అధికారులు. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు లంక నుంచి అయోధ్య చేరుకున్న దృశ్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. పుష్పకవిమానంలో అయోధ్యకు శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు రావడం.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికే సన్నివేశం అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. దీపావళి సందర్భంగా అయోధ్యలో ప్రతిఏటా దీపోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈసారి 12 లక్షల దీపాలు వెలిగించడంతో ఈ కార్యక్రమం గిన్నిస్‌ రికార్డ్‌‌లోకి ఎక్కింది.

కాగా, దీపావళి సంబరాలు అయోధ్యలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పలువురు కేంద్రమంత్రులు, యూపీ సీఎం యోగి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయోధ్యలో ప్రతి ఏటా ఘనంగా దీపోత్సవ్‌ను నిర్వహిస్తున్న సీఎం యోగిని అభినందించారు కిషన్‌రెడ్డి. అయోధ్యను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. రూ. 600 కోట్లతో అయోధ్యలో అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు సీఎం యోగి.

Also read:

Petrol and Diesel Price Cuts: పెట్రోల్, డీజిల్‌ అసలు ధర ఎంత?.. ప్రభుత్వాలు వేస్తున్న వ్యాట్ ఎంత?.. పూర్తి వివరాలు మీకోసం..

Crime News: పొలంలో పనిచేస్తున్న మహిళపై భూస్వామి అత్యాచారం.. మనస్థాపంతో బాధితురాలు అఘాయిత్యం..

T20 World Cup 2021: నాలుగేళ్ల వనవాసం ముగిసింది.. ఆనాటి పరిస్థితులెంతో కఠినం: భావోద్వేగానికి గురైన భారత స్టార్ బౌలర్..!