Abu-Dhabi’s Hindu Temple: అబుదాబిలో 27 ఎకరాల హిందూ దేవాలయం.. ప్రారంభానికి సర్వం సిద్ధం.. ప్రారంభోత్సవం ఎప్పుడంటే..?

| Edited By: Ravi Kiran

Jul 20, 2023 | 12:58 PM

Abu-Dhabi's Hindu Temple: యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దేశ రాజధాని అబుదాబిలో రూపుదిద్దుకుంటున్న అతిపెద్ద హిందూ దేవాలయాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నామని BAPS హిందూ మందిర్ తెలిపింది. మిడిల్ ఈస్ట్‌ ప్రాంతంలో నిర్మితమవుతున్న ఈ ఆలయం మొట్టమొదటి హిందూ..

Abu-Dhabis Hindu Temple: అబుదాబిలో 27 ఎకరాల హిందూ దేవాలయం.. ప్రారంభానికి సర్వం సిద్ధం.. ప్రారంభోత్సవం ఎప్పుడంటే..?
Abu Dhabi's Hindu Temple
Follow us on

Abu-Dhabi’s Hindu Temple: యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దేశ రాజధాని అబుదాబిలో రూపుదిద్దుకుంటున్న అతిపెద్ద హిందూ దేవాలయాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నామని BAPS హిందూ మందిర్ తెలిపింది. మిడిల్ ఈస్ట్‌ ప్రాంతంలో నిర్మితమవుతున్న ఈ ఆలయం మొట్టమొదటి హిందూ రాతి దేవాలయం కావడం దీని ప్రత్యేకత. ఈ మేరకు యూఏఈలోని ఆలయ ప్రారంభోత్సవాన్ని అతిపెద్ద సామరస్య పండుగలా నిర్వహించనున్నామని హిందూ మందిర్ అధికార ప్రతినిథులు తెలిపారు. ఈ క్రమంలోనే  BAPS హిందూ మందిర్ ప్రపంచ సామరస్యానికి ఆధ్యాత్మిక ఒయాసిస్ అవుతుందని, ఈ ప్రారంభోత్సవ పండుగ భారత కళలు, విలువలు, సంస్కృతిని యూఏఈకి తీసుకొచ్చే వేడుక అవుతుందని ఆ దేశం పేర్కొంది.

అబు మురేఖాలో 27 ఎకరాల విస్తీర్ణంలో జీవం పోసుకుంటున్న ఈ హిందూ దేవాలయాన్ని పూజ్య మహంత్ స్వామి మహరాజ్ నేతృత్వంలో బీఏపీఎస్ ఆలయాన్ని 2024, ఫిబ్రవరి 14న ప్రారంభించనున్నారు. ఈ వేడుక గొప్ప ఆధ్యాత్మికత, విశ్వాసం కలగలిసినది ఉండబోతుందని హిందూ మందిర్ ప్రతినిథులు పేర్కొన్నారు. ఆలయ అధిపతి బ్రహ్మవిహారీదాస్ స్వామి పర్యవేక్షణలో ప్రాణం పోసుకుంటున్న ఈ ఆలయం వచ్చే ఫిబ్రవరి 18 నుంచి అందుబాటులోకి రానుంది. అలాగే ఫిబ్రవరి 15న స్వామి మహరాజ్ సమక్షంలో ప్రజా సమర్పణ సభ జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు మందుగానే ఫెస్టివల్ ఆఫ్ హార్మోనీ వెబ్‌సైట్‌కి వెళ్లి రిజస్ట్రేషన్ చేసుకోవలసి ఉంది.

కాగా, అబుదాబిలో హిందూ దేవాలయ నిర్మాణానికి అనుమతినిస్తూ యూఏఈ ప్రభుత్వం 2015 ఆగస్టులో భూమిని కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు, రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ భూమిని బహుమానంగా BAPS(బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ)కి ఇచ్చారు. 2018 ఫిబ్రవరిలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. పింక్ సాండ్‌స్టోన్‌తో నిర్మితమవుతున్న ఈ ఆలయం దాదాపు 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..