పదో విడత సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేసిన ఆర్‌బీఐ.. గ్రాము బంగారం ధ‌ర రూ. 5,104 గా నిర్ణయం

ప‌దో ద‌శ‌ సావరిన్ ప‌స‌డి బాండ్ల జారీ ప్రక్రియ ప్రారంభించి ఆర్‌బీఐ.

పదో విడత సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేసిన ఆర్‌బీఐ.. గ్రాము బంగారం ధ‌ర రూ. 5,104 గా నిర్ణయం
Follow us

|

Updated on: Jan 11, 2021 | 1:13 PM

Sovereign Gold Bonds Open : ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరంలో ప‌దో ద‌శ‌ సావరిన్ ప‌స‌డి బాండ్ల జారీ ప్రారంభ‌మైంది. ఈ ఇష్యూ జనవరి 15న‌ శుక్రవారంతో ముగియనుంది. గ్రాము బంగారం ధ‌ర రూ. 5,104 గా నిర్ణయించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఆన్‌లైన్‌లో గోల్డ్ కొనుగోలు చేసే వినియోగదారులకు గ్రాముకి రూ. 50 ప్రత్యేక తగ్గింపు ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే రిటైల్ పెట్టుబ‌డుదారుల‌కు ఇది ఉత్తమమైన మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిలో రెండుర‌కాల ప్రయోజ‌నాలు ఉన్నాయని చెబతున్నారు. పెట్టుబడిదారులు తమ పెట్టుబడిపై సంవత్సరానికి 2.5% స్థిర వడ్డీని పొందడంతో పాటు, బంగారం ధ‌ర పెరిగితే ఆ లాభాన్ని కూడా పొంద‌వ‌చ్చంటున్నారు.

ఇటీవల 2020 డిసెంబర్ 28 నుంచి 2021 జనవరి 1 వరకు జారీచేసిన‌ బాండ్ల (సిరీస్ IX) ఇష్యూ ధర గ్రాము బంగారానికి రూ. 5,000. ఈ సావరిన్ బంగారు బాండ్లను భారత ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ జారీ చేస్తుంది. 2019, 2020 సంవత్సరాల్లో బంగారం గ‌ణ‌నీయ‌మైన‌ లాభాలను సాధించింది. రెండంకెల వృద్ధిని న‌మోదుచేసింది. గత ఏడాది ఆగస్టులో బంగారం 10 గ్రాములకు రూ.56,200 వ‌ద్దకు చేరింది. కొంతకాలంగా రూ. 48,000 నుంచి 52,000 పరిధిలో ట్రేడవుతోంది.

ఇదిలావుంటే, అమెరికా డాల‌ర్‌ బలోపేతం, అధిక బాండ్ల దిగుబడి కారణంగా అంతర్జాతీయ పెట్టుబడిదారులకు బంగారాన్ని ఖరీదైనదిగా మారింది. అమెరికాలో పాలన మార్పులు, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, క‌రోనా టీకా ప్రక్రియ సమర్థత బంగారం ధరలకు మార్గనిర్దేశం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.

హైదరాబాద్ మహానగరానికి మరో అంతర్జాతీయ సంస్థ.. భారీ పెట్టుబడితో గ్లోబ‌ల్ కేప‌బిలిటీ సెంట‌ర్‌