02 April 2025
Subhash
ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్ల నుంచి మూడు రోజుల్లోనే రూ.5 లక్షల వరకు విత్డ్రా చేసుకోవచ్చు.
ప్రస్తుతం లక్ష రూపాయలుగా ఉన్న ఆటో సెటిల్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ (ఏఎస్ఏసీ) పరిమితిని ఐదు రెట్లు పెంచాలని ఈపీఎఫ్వో నిర్ణయించింది.
తాజాగా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మే 2024లో రూ. 50 వేల నుంచి రూ. ఒక లక్షకు ఈపీఎఫ్ఓ పెంచింది. వైద్యం, విద్య, వివాహం, గృహ నిర్మాణ అవసరాల కోసం ఏఎస్ఏసీ కింద పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు.
అప్లయ్ చేసుకున్న మూడు రోజుల్లోపు పీఎఫ్ డబ్బులు ఖాతాలో జమవుతాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ సభ్యులు 7.5 కోట్లకు చేరుకున్నారు.
ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ మోడ్ను ఏప్రిల్ 2020లో తీసుకొచ్చింది. వైద్య ఖర్చుల కోసం, విద్య, వివాహం, గృహనిర్మాణం వంటి వాటి కోసం అడ్వాన్స్గా నగదు తీసుకునేందుకు అవకాశం లభించింది.
మార్చి 6, 2025 నాటికి 2.16 కోట్ల ఆటో క్లెయిమ్లు ప్రాసెస్ చేయబడ్డాయి. గతంలో కంటే ఇప్పుడు మూడు రోజుల్లోనే 95 శాతం ఆటో మోడ్ క్లెయిమ్లు. తిరస్కరణ రేటు 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గింది.
ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ పరిమితిని పెంచడం వల్ల, క్లెయిమ్ పరిష్కారాల సంఖ్య మొదటిసారి 6 కోట్లు దాటుతుందని భావిస్తున్నారు.